అక్షర కోయల.. అమృత కోవెల
కోయ తెగకు చెందిన గిరిజనులు... పూర్వీకుల నుంచి వస్తున్న వారి తల్లి భాషతోనే నిత్య జీవనం సాగిస్తున్నారు. వారి ప్రాంతంలో మాత్రమే తమలో తాము సంభాషించుకునేందుకు తప్ప కోయ భాషకు ప్రత్యేకించిన నిఘంటువు లేదు.
నిఘంటువు రూపొందించే క్రమంలో చర్చిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు
న్యూస్టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం
కోయ తెగకు చెందిన గిరిజనులు... పూర్వీకుల నుంచి వస్తున్న వారి తల్లి భాషతోనే నిత్య జీవనం సాగిస్తున్నారు. వారి ప్రాంతంలో మాత్రమే తమలో తాము సంభాషించుకునేందుకు తప్ప కోయ భాషకు ప్రత్యేకించిన నిఘంటువు లేదు. రాజమహేంద్రవరం ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు పలువురు విద్యాభ్యాసం చేస్తున్నారు. అంతరించిపోతున్న భాషల జాబితాలో చేరుతున్న కోయ భాష పదిలంగా ఉండాలనే తపనతో కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘కోయ పద నిఘంటువు’ రూపొందిస్తున్నారు. వరాలు వారి మాటల్లో...
కోయ భాషలో ఇంతవరకు ఎలాంటి నిఘంటువు లేదు. ఎస్కేవీటీ కళాశాల తెలుగు విభాగం నిర్వహణలో ఈ భాషను పదిలంగా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా గిరిజన విద్యార్థులతో ప్రాజెక్ట్ వర్కుగా దీనిని చేయిస్తున్నారు. ఇందులో కాల సంబంధ పదాలు, కుటుంబ బాంధవ్యాలు, పనిముట్లు, సంఖ్యలు, కట్టడాలు, భవనాలు, మొక్కలు, పొదలు, చెట్లు, పండ్లు, ఆకుకూరలు, పండుగలు, ఆభరణాలు, క్రీడలు, క్రిమికీటకాలు తదితర పదాలను సెలవుల్లో వారి గ్రామాలకు వెళ్లినపుడు విద్యార్థులు సేకరిస్తారు. ప్రస్తుతం ఆరువందల పదాల వరకు ఇలా సేకరించాం. ఇందులో 20 మంది గిరిజన విద్యార్థులు పాల్గొంటున్నారు. ‘కళాశాలలో కోయ భాషకు చెందిన విద్యార్థులు దూరప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది ఇక్కడే చదువుతున్నారు. ఈ పరిశోధనాత్మక నిఘంటువు రాబోయే తరాలకు పదిలంగా ఉంటుంది’ అని ప్రిన్సిపల్ ఎబెల్ రాజబాబు చెప్పారు.
కోయ భాషలో కొన్ని పదాలు
* దోడతిత్తినే(అన్నం తిన్నావా)
* బాత్కుసిరి(ఏం కూర)
* ఏరు వాట(నీరు ఇవ్వు, పెట్టు)
* మీ పెదేరు బాత(నీ పేరు ఏమిటి)
* మరం (చెట్టు) ః వీసి (ఈగ)
* కెల్లా (చెప్పు) ః వెరకాడు (పిల్లి)
* గొగ్గోడు (కోడిపుంజు)
* ఇయ్య (నాన్న)
* అవ్వ (అమ్మ)
ఆదరణ కావాలి..
మా భాషకు లిపిని కనుక్కొని అందరికీ తెలియజేయాలి. దేశంలోని ఇతర భాషలను ఏవిధంగా నేర్చుకుంటున్నారో అలాగే ఈ భాషను నేర్చుకునేందుకు ముందుకు రావాలి. మా మాతృ భాషను ఏ పాఠశాలలోను నేర్పించలేదు. మా ద్వారా కోయ భాష గొప్పతనం గురించి అందరికీ తెలిసేలా నిఘంటువు రూపొందించడం సంతోషంగా ఉంది.
రామసింధు మడకం, ఏజీ కోడేరు, చింతూరు మండలం
ప్రాముఖ్యత తెలియాలి..
మా మాతృ భాష ప్రాముఖ్యత అందరికీ తెలియాలి. ఇప్పటికే కోయ భాష కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. కళాశాల ద్వారా చేపడుతున్న ప్రయత్నంతో కొత్త ఆశలు కలిగాయి. మాకంటూ ఓ భాష ఉంది. అది ప్రపంచానికి తెలిసే విధంగా పద నిఘంటువు తయారు చేయడంలో మేమంతా పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది.
సోడే రాజు, శివకాశీపురం, జంగారెడ్డిగూడెం
విద్యార్థుల తపన చూసి...
గిరిజనేతర భాషల్లో కోయభాషకు ప్రత్యేకత ఉంది. తెలుగుశాఖ తరఫున పరిశోధనాత్మకంగా ఈ ప్రయోగాన్ని చేపట్టాం. విద్యార్థులతో పదాలను సేకరించి వాటికి తెలుగు, హిందీ, ఆంగ్లంలో అర్థాలు వచ్చేలా రూపొందిస్తున్నాం. మా కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులు వారి తల్లి భాషను కాపాడుకోవాలనే తపన చూశాక దీనిపై పరిశోధన ప్రారంభించా.
పి.వి.బి.సంజీవరావు, కళాశాల తెలుగు శాఖాధిపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434