వైకాపా ఫ్లెక్సీల రాజకీయం
రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విస్తృత ఏర్పాట్లు చేస్తుంటే వాటిని అడ్డుకునేందుకు అధికార వైకాపాకు చెందిన కొందరు కుయుక్తులు పన్నుతున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు.
తోరణాలు తొలగిస్తున్నారని తెదేపా ఆరోపణ
ఈనాడు, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విస్తృత ఏర్పాట్లు చేస్తుంటే వాటిని అడ్డుకునేందుకు అధికార వైకాపాకు చెందిన కొందరు కుయుక్తులు పన్నుతున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో నగరాన్ని శోభాయమానంగా అలకరించాలని భావించి జాతీయ రహదారికి ఇరువైపులా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నగరంలోని డివైడర్లు, ఇతర ప్రాంతాల్లో పచ్చ తోరణాలు కడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల రాత్రి సమయంలో పసుపు తోరణాల మధ్య వైకాపా తోరణాలు కడుతున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంపీ భరత్ తన పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగులను నెలాఖరు వరకు ఉంచాలని, తీస్తే సహించేది లేదని అధికారులను ఆదేశించినట్లు తెదేపా నాయకులు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఏ నాయకుడు పుట్టిన రోజు వేడుక నిర్వహించినా నాలుగైదు రోజులపాటు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఉంచి తరువాత తీసేయడం చేస్తుంటారు. ఎంపీ పుట్టిన రోజు మే 12న నిర్వహించినా ఇప్పటికీ నగరంలో అనేక చోట్ల హోర్డింగ్లు, కటౌట్లు ఉన్నాయి. మరోవైపు మహానాడు ఫ్లెక్సీలను తొలగించి వైకాపావి ఏర్పాటు చేస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు గతంలో ఎన్నడూ లేవని, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షం ఏదైనా భారీ కార్యక్రమం చేపడితే ఎటువంటి అడ్డంకులు లేవని పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతి పండగని, అటువంటి మహనీయుణ్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటున్నారు.
దిగజారుడు రాజకీయాలు : గోరంట్ల
రాజమహేంద్రవరం కేంద్రంగా అనేక మంది నాయకులు రాష్ట్రస్థాయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు సమయంలో దిగజారుడు రాజకీయాలు చేయలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమానికి సంబంధించి ట్రాఫిక్, పార్కింగ్, పోలీసు బందోబస్తు అంశాలపై గురువారం తెదేపా నాయకులు జిల్లా ఎస్పీని కలిసి విన్నవించారు. అనంతరం గోరంట్ల విలేకరులతో మాట్లాడారు. వైకాపా వింత పోకడలకు పోయి నగరంలో తెదేపా కట్టిన మహానాడు బ్యానర్లను తొలగించడం సరికాదని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది వస్తారని, వారి ముందు చారిత్రక నగరం రాజమహేంద్రి పరువు తీసే చర్యలకు పూనుకోవద్దని హితవు పలికారు. ఇటువంటి దుందుడుకు చర్యల వల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని, రాజకీయాలు హుందాతనంగా చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్ సారథ్యంలో వైకాపా నాయకులు దురుద్దేశంతో తెదేపా బ్యానర్లను తొలగించడం సరికాదన్నారు. ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు వేసే విష సంస్కృతి మంచిది కాదన్నారు. ఎంపీ ఎందుకు విధ్వంసకారుడిగా మారుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పెద్ద విధ్వంసకారులను ఆనంద పర్చడం కోసం బహుశా కష్టపడుతున్నాడేమో అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతున్న ఈ ఆరాచకాలు ఖండిస్తున్నామన్నారు. గతంలో రైతు పాదయాత్ర సమయంలోనూ తప్పుడు విధానాలు అవలంబించారన్నారు. లక్షలాది మంది వచ్చే కార్యక్రమంలో ఇలాంటి పనులకు ఎవరైనా చిరాకుతో ఆవేశపడే అవకాశముందన్నారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదని, ప్రైవేటు వాహన యజమానులను భయపెడుతున్నారని ఆరోపించారు.
శాంతిభద్రతల సమస్య వస్తే అది ఎంపీ వల్లే: జవహర్
రాజమహేంద్రవరంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే అది ఎంపీ భరత్ వల్లేనని తెదేపా నాయకుడు, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. మహానాడుకు రాక్షసులు మాదిరి అడ్డుపడటానికి భరత్ అనుచరులు ఏవిధంగా ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తోందన్నారు. ఆయన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో దళితులకు శిరోముండనం జరిగితే నోరెత్తని భరత్ ఇప్పుడు రెచ్చగొడుతున్నారన్నారు. ‘ప్రశాంతంగా ఉన్న రాజమహేంద్రవరాన్ని మీ చేష్టలతో రెచ్చగొడితే దాని ఫలితం అనుభవిస్తారు. మీకు, మీ కుటుంబానికి గుర్తింపు వచ్చిందంటే ఎవరివల్లో గుర్తుంచుకో’ అని ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దళితులు, బీసీల అభివృద్ధి చంద్రబాబు చేస్తే ఆయన్ను రావద్దనడానికి నువ్వెవరని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం