పెండ్యాలకు గ్యాస్ కష్టాలు
‘గ్యాస్ లేకపోతే వంట ఉండదు’ అనే మాటను ఇంతవరకు వింటున్నాం.. గ్యాస్ లేకపోతే పంట కూడా పండదని నేడు వినాల్సి వస్తోంది.
ఖరీఫ్పై అన్నదాత అయోమయం
న్యూస్టుడే, నిడదవోలు
పంపుల నుంచి రాని సాగునీరు
‘గ్యాస్ లేకపోతే వంట ఉండదు’ అనే మాటను ఇంతవరకు వింటున్నాం.. గ్యాస్ లేకపోతే పంట కూడా పండదని నేడు వినాల్సి వస్తోంది. విచిత్రంగా అనిపించినా అది నిజం... నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు, పెరవలి మండలాల పరిధిలో సుమారు 6,200 ఎకరాలకు సాగునీరు అందించే పెండ్యాల ఎత్తిపోతల పథకం ఆయకట్టుది ఇదే పరిస్థితి. కొవ్వూరు మండలం సీతంపేట వద్ద ఉన్న జీటీపీఎస్లో గ్యాస్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేవారు. ఇందుకు వారికి నీరు అవసరం. దీని దృష్ట్యా కాటన్ ఆనకట్ట వెనుక నుంచి సగటున 70 క్యూసెక్కుల నీటిని వారు తీసుకుని జీటీపీఎస్లో టర్బయిన్ల కూలింగ్కు వినియోగించేవారు. అలా వినియోగించిన నీటిని వృథా కాకుండా చాలా ఏళ్లుగా పెండ్యాల ఎత్తిపోతల పథకానికి అందించేవారు. దీంతో ఈ ఆయకట్టులో రెండు పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తలేదు. గోదావరి పరిధిలోని మూడు డెల్టాల్లో రబీలో సాగునీటి కష్టాలు ఎదురై కొన్ని సందర్భాల్లో పలుచోట్ల పంట విరామం ప్రకటించినప్పుడూ ఈ 6,200 ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు ఉండేవి కావు. ఈ ఆయకట్టు రైతులు పంట విరామం ఎరుగరు. ప్రస్తుత రబీ పంటకాలం నుంచి పెండ్యాల పంపింగ్ స్కీంకు కష్టాలు మొదలయ్యాయి. దీనికి కారణం జీటీపీఎస్కు సరఫరా అయ్యే గ్యాస్ ధర పెరగడంతో సంస్థ నష్టాల్లోకి చేరి ఉత్పత్తి నిలిచిపోవడమే.
ముందుకు రాని గుత్తేదారులు
జీటీపీఎస్ ద్వారా వచ్చిన నీటితో ఆయకట్టును సాగు చేసేవారు. దీంతో పంపుహౌస్ అవసరం అంతగా లేకపోవడంతో పంపులు, మోటార్లు, విద్యుత్తు సదుపాయం మూలకు చేరాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో అప్పటి ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సుమారు రూ.3 కోట్లు వెచ్చించి వీటిని వినియోగంలోకి తెచ్చారు. గత రబీ నుంచి జీటీపీఎస్ ద్వారా నీరు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం ఇవే రైతుల అవసరాలు తీర్చుతున్నాయి. అయితే వీటి నిర్వహణతో పాటు సాగునీరు అందించే బాధ్యతను గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. రబీలో ఇలానే సాగినా, ఖరీఫ్కు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. టెండర్లు పిలిచినా స్పందన రాలేదు. ఈ నెల 12 నుంచి 19 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అధికారులు గడువు నిర్ణయించారు. ఇప్పుడు కూడా గుత్తేదారులు ముందుకు రాకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జూన్ 1నే మూడు డెల్టాలకు సాగునీటిని విడుదల చేశారు. ప్రస్తుతం పిలిచిన టెండర్ గడువు ముగిసేనాటికి జూన్ నెల మూడో వారంలోకి చేరుతుంది. ఇలా అయితే తమ ఖరీఫ్ పంట కాలం తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రూ.1.50 కోట్ల విద్యుత్తు బకాయిలు
పెండ్యాల పథకం విద్యుత్తు శాఖకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల వరకు ఉంటాయని అంచనా. రానున్న రోజుల్లో వీటిని చెల్లించాలని జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి విద్యుత్తు సరఫరా నిలుపుదల చేసే అవకాశం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఇదే అనుభవం ఎదురైంది.
బదలాయింపు దిశగా..
ఇటీవల పూర్తయిన రబీ పంట ముందు వరకు పెండ్యాల ఎత్తిపోతల పథకానికి జీటీపీఎస్లో టర్బయిన్ల కూలింగ్కు వినియోగించిన నీరు రెండు పంటలకు సరాసరి వచ్చేయడంతో పథకం వద్ద అధికారులు నిర్వహణను మరిచారు. నాలుగు పంపులు బాగానే ఉన్నా, దీనికి సంబంధించిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా పాడవడంతో రబీ పంట సమయంలో అధికారులు ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ భారంగా మారడంతో జలవనరుల శాఖ అధికారులు ఈ పథకాన్ని ఏపీఐడీసీకి బదలాయించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. రైతులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఐడీసీకి బదలాయిస్తే పంపింగ్ స్కీం నిర్వహణను రైతులే చేపట్టాల్సి ఉంటుంది. ఇలా రైతుల నిర్వహణలో ఉన్న పలు పంపింగ్ స్కీంలు ఇప్పటికే మూతపడ్డాయి. దీనిని ఐడీసీకి బదలాయిస్తే తమకు ఇబ్బందులు తప్పవని రైతులు అంటున్నారు.
గతంలో పెండ్యాల కాలువకు జీటీపీఎస్ నుంచి సాగునీరు వచ్చిన ప్రాంతం
సాగునీరు ఇచ్చేదెప్పుడు?
ప్రధాన కాలువకు జూన్ 1నే సాగునీటిని విడుదల చేశారు. ఆ ఆయకట్టు పరిధిలో చాలా మంది రైతులు నారుమళ్లు వేసుకునే పనిలో ఉన్నారు. పెండ్యాల ఆయకట్టులో మాత్రం నారుమళ్లు వేయాలా? వద్దా? అనే పరిస్థితి ఉంది. గతంలో జూన్ మొదటి వారంలోనే సాగునీటిని విడుదల చేసేవారు. ప్రస్తుతం నిర్వహణకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. అది ఎప్పుడు పూర్తి చేస్తారు... ఆయకట్టుకు సాగునీరు ఎప్పుడు ఇస్తారు... దీనిపై ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ముందుగా జలవనరుల శాఖ ద్వారా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి.
జె.సుబ్బారావు, రైతు
లేఖ రాశాం
పెండ్యాల పంపింగ్ స్కీంను ఏపీఐడీసీకి బదలాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా పంపింగ్ స్కీం నిర్వహణ చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటిని అందిస్తాం.
ఎస్.దక్షిణామూర్తి, ఈఈ, పశ్చిమడెల్టా
రెండుసార్లు టెండర్లు పిలిచాం
పెండ్యాల స్కీం నిర్వహణ నిమిత్తం ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచాం. స్పందన రాలేదు. మళ్లీ మూడోసారి టెండర్లు పిలుస్తాం. టెండర్ ఖరారు కాగానే సాగునీటి విడుదలకు చర్యలు తీసుకుంటాం.
వేమూరి సత్యదేవ, జలవనరుల శాఖ డీఈ, తాడేపల్లిగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం