logo

AP News: శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా: మాజీ ఎమ్మెల్యే యరపతినేని 

నేను తప్పు చేసి ఉంటే... శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా.. అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాచేపల్లి సభలో ఉద్వేగానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గౌరవసభ.. ప్రజా సమస్యలపై చర్చా

Updated : 15 Dec 2021 08:54 IST

దాచేపల్లిలో నిర్వహించిన సభలో శ్రీనివాసరావు 

దాచేపల్లి, న్యూస్‌టుడే: నేను తప్పు చేసి ఉంటే... శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా.. అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాచేపల్లి సభలో ఉద్వేగానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గౌరవసభ.. ప్రజా సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. సభలో యరపతినేని మాట్లాడుతూ మన మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గురజాల సహా రాష్ట్రంలో పార్టీని పట్టుదలతో గెలిపించుకుందామని చెప్పారు. నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని కాపాడతానన్నారు. తాను మారానని.. మరింత మారతానంటూ పదేపదే చెప్పారు. జనవరి నుంచి ప్రతి గ్రామంలో తిరిగి, ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుస్తానన్నారు. సభలో దాచేపల్లి తెదేపా కౌన్సిలర్లు ఏడుగురిని ఘనంగా సన్మానించారు. 


దాచేపల్లిలో ఎడ్లబండ్లతో ప్రదర్శన 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని