చెరుకూరు టు అమెరికా
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది బాపట్ల గురుకుల విద్యార్థిని అక్ష. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో వేల మందితో పోటీపడి అమెరికాలో చదువుకునే అరుదైన అవకాశం దక్కించుకుంది.
జాతీయ స్థాయి పోటీ పరీక్షలో గురుకుల విద్యార్థిని అక్ష ప్రతిభ
వాషింగ్టన్ బ్రెమెర్టన్ విద్యాలయంలో ఇంటర్ చదివేందుకు అవకాశం
బాపట్ల, న్యూస్టుడే
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది బాపట్ల గురుకుల విద్యార్థిని అక్ష. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో వేల మందితో పోటీపడి అమెరికాలో చదువుకునే అరుదైన అవకాశం దక్కించుకుంది. కెనడీ లిగర్ యూత్ ఎక్ఛేంజ్ స్టడీ(కేఎల్వైఈఎస్) కింద నీతిఆయోగ్ ద్వారా ఏటా 35 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి కేంద్రం సొంత నిధులను వెచ్చించి పంపిస్తుంది. పోటీ పరీక్షలో సత్తా చాటి వాషింగ్టన్ బ్రెమెర్టన్ విద్యాలయంలో సీటు దక్కించుకుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన విద్యార్థులతో కలిసి అక్ష దిల్లీ నుంచి విమానంలో అమెరికాకు సోమవారం పయనమైంది. మొదటి నుంచి చదువులో రాణిస్తూ విశేష ప్రతిభ చాటిన అక్ష ప్రస్థానం గురించి తెలుసుకుందామా..
పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన కొమరాబత్తిన అక్ష నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి మరియరాజు టీకొట్టు నిర్వహిస్తున్నారు. తల్లి రత్నకుమారి దర్జీగా పని చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. నరసాయపాలెం గురుకులంలో 9, 10 తరగతులు చదివింది. ప్రిన్సిపల్ వినీత విద్యార్థినిలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. పదో తరగతి ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించింది. 2021లో బాపట్ల బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో జూనియర్ ఇంటర్ ఎంపీసీలో చేరింది. 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. అమెరికాలో విద్య అభ్యసించడానికి దేశవ్యాప్తంగా జూనియర్ ఇంటర్ విద్యార్థులకు నీతిఅయోగ్ 2021లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో వేల మంది విద్యార్థులతో అక్ష పోటీ పడింది. తొలి ప్రయత్నంలో విఫలమై పరీక్షలో అర్హత సాధించలేదు. అపజయానికి విద్యార్థిని కుంగిపోలేదు. మరింత పట్టుదలతో కష్టపడి చదివి కేంద్రం రెండోసారి పోటీ పరీక్ష రాయడానికి కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తుది పరీక్షలో ఎంపికైన 125 మందికి గతేడాది సెప్టెంబరులో మౌఖిక పరీక్ష నిర్వహించి 35 మంది ప్రతిభావంతులకు అమెరికాలో ద్వితీయ ఇంటర్ స్థాయి విద్య అభ్యసించడానికి కేంద్రం ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఎంపికైన ముగ్గురిలో అక్ష ఒకరు. మారుమూల గ్రామం చెరుకూరు నుంచి వచ్చిన విద్యార్థిని అమెరికా వాషింగ్టన్ బ్రెమెర్టన్ ఉన్నత పాఠశాలలో పది నెలలు సీనియర్ ఇంటర్ చదివేందుకు అవకాశం దక్కించుకుని సొంతూరితో పాటు గురుకుల విద్యాలయకు గర్వకారణంగా నిలిచింది. బాపట్ల గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ భవానీదేవి, అధ్యాపకులు రూ.లక్ష విరాళం అందజేసి ఆ నగదుతో విద్యార్థినికి దుస్తులు, సెల్ఫోన్, ల్యాప్ట్యాప్, పరికరాలు అందజేశారు. అక్షను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ అభినందించి సత్కరించారు. మూడ్రోజుల క్రితం గన్నవరం నుంచి దిల్లీ చేరుకున్న విద్యార్థిని సహచర విద్యార్థులతో కలిసి సోమవారం అమెరికా బయలుదేరి వెళ్లింది.
మంత్రి మేరుగ నాగార్జున నుంచి అభినందనలు అందుకుంటున్న విద్యార్థిని అక్ష
గొప్ప అవకాశంగా భావిస్తున్నా..
ప్రాథమిక పరీక్షలో తొలి ప్రయత్నంలో వైఫల్యం చెందడంతో కొంత నిరాశకు గురయ్యా. ప్రిన్సిపల్ భవానీదేవి, అధ్యాపకులు జయలక్ష్మి, అనూరాధ ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. వారిచ్చిన ధైర్యంతో రెండో ప్రయత్నంలో రోజూ ఐదు గంటలు కష్టపడి చదివి ఆంగ్లంలో పట్టు సాధించి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి విజయం సాధించా. నా తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో అంతా గురుకుల విద్యాలయ అధ్యాపకులే చూసుకున్నారు. పదో తరగతిలోనే నాలో ప్రతిభను గుర్తించి నరసాయపాలెం గురుకులం ప్రిన్సిపల్ వినీత, ఉపాధ్యాయిని సరళ ఎంతగానో ప్రోత్సహించారు.
- అక్ష, విద్యార్థిని
మా సొంత బిడ్డ వెళ్లినట్లుగా ఉంది
మా గురుకులం విద్యార్థిని అక్ష అమెరికాలో విద్య అభ్యసించటానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తే విజయాలు సాధిస్తారనడానికి అక్ష ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. వేల మంది విద్యార్థులతో పోటీ పడిన అక్ష తన ప్రతిభతో గొప్ప అవకాశాన్ని దక్కించుకుంది. అక్ష అమెరికా వెళ్తుంటే మా సొంత బిడ్డ వెళ్లినట్లుగా ఉంది.
- కె.భవానీదేవి, ప్రిన్సిపల్, బాపట్ల అంబేడ్కర్ గురుకులం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం