మన నేలపై కొలువుదీరాలి..!
హైదరబాద్లో పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు మన రాష్ట్రం వారే.. మనప్రాంతం వారే.. ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్లి వారి మేథస్సును వినియోగిస్తున్నారు. సాంకేతిక విద్య చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా కృష్ణా జిల్లా నుంచి డిగ్రీ, పీజీ విద్యను ఏటా 30వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరంతా అటు ప్రభుత్వ కొలువుల వైపు లేదా ప్రాంగణ నియామకాల్లో ఎంపికై పక్క రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నారు.
వంద మంది యువతతో సర్వే
న్యూస్టుడే, విజయవాడ విద్య
దేశంలో ప్రతి ముగ్గురు ఐటీ ఉద్యోగుల్లో ఒక్కరు తెలుగువారు.. వారంతా హైదరబాదులో ఉన్నారు.
- ఇది ఓ సర్వే నివేదిక
హైదరబాద్లో పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు మన రాష్ట్రం వారే.. మనప్రాంతం వారే.. ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్లి వారి మేథస్సును వినియోగిస్తున్నారు. సాంకేతిక విద్య చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా కృష్ణా జిల్లా నుంచి డిగ్రీ, పీజీ విద్యను ఏటా 30వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరంతా అటు ప్రభుత్వ కొలువుల వైపు లేదా ప్రాంగణ నియామకాల్లో ఎంపికై పక్క రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. కొత్త రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లయింది. ఇక్కడకు బహుళ జాతి సంస్థలు వస్తే.. పక్క రాష్ట్రాల వైపు మన విద్యార్థులు వెళ్లే అవసరమే ఉండదు. వచ్చే 25 ఏళ్లలో మన ప్రాంతంలోనే మన విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకుంటున్నారు. అలాగే పరిశ్రమలు రావాలి, యువతరం స్టార్టప్లతో ముందడుగు వేసేలా శిక్షణ ఇవ్వాలి.
ఐటీ సంస్థలు ఇక్కడే నెలకొల్పాలి
ఎస్.గీతిక, బీటెక్ విద్యార్థిని
ప్రస్తుతం మన ప్రాంతంలో విద్యార్థులు అత్యధిక వార్షిక వేతనంతో ఎంపికవుతున్నారు. కానీ కొలువులు చేయటానికి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వచ్చే 25 ఏళ్లలోనైనా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు దీటుగా తయారవ్వాలి.
అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు రావాలి
-బీఎస్ఎన్ దుర్గాప్రసాద్, ఐఏఎస్ అకాడమీ
ఈ ప్రాంతంలో పేరున్న అంతర్జాతీయ సంస్థలు లేవు. మన ప్రాంతానికి సెంట్రల్ యూనివర్సటీ కావాలి. బిజినెస్ స్కూల్ ఇక్కడ లేదు. ఐఎస్బీ (ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్), ఐఎస్ఐ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్), ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) సీసీఎంబీ, ఐఐసీటీ లాంటి సంస్థలు ఇక్కడ రానున్న రోజుల్లో ఏర్పాటు చేయాలి. ఇక్కడ పరిశోధనా సంస్థలను నెలకొల్పాలి. స్థానిక విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతరులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక వనరులు పెరుగుతాయి.
నైపుణ్య శిక్షణ కేంద్రాలు అవసరం
-కోటంరాజు శరత్కుమార్, డైరెక్టర్, కేఎల్ విశ్వవిద్యాలయం
గ్రామీణ యువత ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. వీరికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదంతో రానున్న రోజుల్లో ఎక్కువగా వస్తువుల ఉత్పత్తి మన దగ్గరే జరిగే అవకాశం ఉంది. వీటికి తగినట్టుగా యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ మన విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక్కడే బహుళజాతి సంస్థలు వచ్చేలా కృషి చేయడం ద్వారా మన యువతకు మన దగ్గరే ఉద్యోగాలు వస్తాయి.
పరిశ్రమల ఏర్పాటే ప్రధానం
ఎ.చరణ్, బీటెక్ విద్యార్థి
మన ప్రాంతంలోని పారిశ్రామికవాడలలో పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నప్పుడే విద్యార్థులకు, యువతకు ఉపాధి దొరుకుతుంది. ఉన్న ఎంఎస్ఎంఈలు కూడా కరోనా కారణంగా మూతపడేస్థితిలో ఉన్నాయి. రానున్న రోజులలో ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి. ప్రైవీటీకరణ ఊపందుకున్న నేపథ్యంలో పారిశ్రామీకరణను, అంకురాలను ప్రోత్సహించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం