పోలీసు దిగ్బంధంలో ముఖ్యమంత్రి నివాసం
వాల్మీకి, కులస్థులను ఎస్టీలో చేర్చవద్దని కోరుతూ గిరిజన సంఘాలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
తాడేపల్లి వద్ద అడుగడుగునా తనిఖీలు చేస్తున పోలీసులు
తాడేపల్లి, న్యూస్టుడే: వాల్మీకి, కులస్థులను ఎస్టీలో చేర్చవద్దని కోరుతూ గిరిజన సంఘాలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో సీఎం నివాసాన్ని పోలీసులు సోమవారం దిగ్బంధించారు. నివాసం చుట్టూ నిరంతరం కొనసాగే చెక్ పోస్టులకు అదనంగా ఏర్పాటు చేశారు. దాదాపు 350 మంది పోలీసు బలగాలను మోహరించి అదనపు బందోబస్తును నిర్వహించారు. వేకువజాము నుంచే పోలీసు బలగాలు తాడేపల్లిలోని సీఎం నివాసం చుట్టూ కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. సీఎం నివాసానికి వెళ్లే మార్గాలతో అనుసంధానంగా రోడ్లన్నింటిని పోలీసులు మూసివేశారు. అడుగడుగునా ఆంక్షలను విధించారు. విజయవాడ నుంచి తాడేపల్లి చేరుకునే మార్గంలోని వారధి ప్రాంతంలో సర్వీసు మార్గాన్ని మూసివేశారు. తాడేపల్లి వెళ్లాల్సిన వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రాతూరు కరకట్టపై నుంచి విజయవాడ వెళ్లే రేపల్లె ఆర్టీసీ బస్సులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రమాదకరమైన మార్గాల్లో బస్సులను అతికష్టంపై జాతీయ రహదారిపైకి చేరుకోవాల్సి వచ్చింది. గుంటూరు వైపు నుంచి తాడేపల్లి వెళ్లాల్సిన వాహనాలను సైతం సర్వీసు మార్గాల్లో పోలీసులు నిలిపివేశారు. ఫలితంగా విజయవాడ, గుంటూరు వెళ్లాల్సిన ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. సర్వీసు మార్గం నుంచి సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో వాహనాలను నిలిపివేశారు. ఉన్నత న్యాయస్థానం, అమరావతి సచివాలయానికి వెళ్లే వారు ఇబ్బందులకు గురయ్యారు. సచివాలయానికి వెళ్లే ప్రధాన మార్గం కావడం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లేవారి బాధలు అంతా ఇంతా కాదు. ఎటువెళ్లినా రోడ్లను పోలీసులు దిగ్బంధించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారధి వద్ద ఇరువైపులా, తాడేపల్లి నుంచి బైపాస్కు వెళ్లే వంతెన వద్ద, ప్రకాశం బ్యారేజీ, ప్రాతూరు క్రాస్ రోడ్డును చెక్ పోస్టులతో మూసివేశారు. ఏ క్షణానైనా గిరిజన సంఘాలు సీఎం నివాస ముట్టడికి వస్తారనే ఉద్దేశంతో సాయంత్రం వరకు బందోబస్తు కొనసాగించారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 52 రద్దు చేయాలన్న డిమాండ్తో గిరిజన సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చింది. పోలీసులను భారీగా మోహరించడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడికక్కడ గిరిజన సంఘాల నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
స్వతంత్ర అభ్యర్థిని.. కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.