బాబోయ్ బండరాళ్లు
నిజాంపట్నం హార్బర్ అభివృద్ధి నిర్మాణ పనులకు పనికి రాని గ్రానైట్ బండరాళ్లను భారీ వాహనాలపై తరలిస్తున్నారు.
ప్రమాదకరంగా తరలించడంతో ఆందోళనలో వాహనచోదకులు
అధిక లోడుతో కుంగుతున్న రహదారులు
టిప్పరుకు బండరాళ్లు లోడు చేస్తున్న పొక్లెయిన్
బల్లికురవ, మార్టూరు, పర్చూరు, న్యూస్టుడే: నిజాంపట్నం హార్బర్ అభివృద్ధి నిర్మాణ పనులకు పనికి రాని గ్రానైట్ బండరాళ్లను భారీ వాహనాలపై తరలిస్తున్నారు. వీటి రవాణా అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది. లారీలపై పరిమితికి మించి వేస్తున్న బండలతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ లోడు వాహనాలు రహదారి అంచుకు వెళితే కూరుకుపోయే ప్రమాదంతో పాటు రోడ్లు కుంగిపోతున్నాయి. పరిస్థితి ఇంతలా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మార్టూరు, బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఎక్కవగా ఉండటంతో వాటి నుంచి వచ్చే వ్యర్థాలను ఒక ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి వాటిని నిజాంపట్నం హార్బరు నిర్మాణానికి తరలిస్తున్నారు. నెల రోజుల నుంచి 70 టిప్పర్లు నిత్యం పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్కో టిప్పరు రోజుకు రెండు మూడు ట్రిప్పులు వేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సగటున 150 నుంచి 200 వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 10, 12 చక్రాల వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. 10 టైర్ల టిప్పర్ 28 టన్నులు, 12 టైర్ల టిప్పరు 35 టన్నులు, 14 టైర్ల టిప్పర్ 42 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటాయి. అదే వాహనాలపై 35 నుంచి 50 టన్నుల వరకు తరలిస్తున్నారు. రహదారులు కుంగి మరమ్మతులకు గురవుతున్నాయి. విజిలెన్స్ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి పరిమితికి మించి ఉన్న బరువుకు టన్నుకు రూ.2 వేల చొప్పున, యజమానికి రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు.
ప్రాణాలు అరచేతిలో పట్టుకొని..
టిప్పర్లపై క్రమ పద్ధతి లేకుండా రాళ్లు తరలించడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎక్కువ టన్నులు తరలిస్తే బాడుగ అధికంగా వచ్చే అవకాశం ఉంటటంతో ఎక్కువ రాళ్లను తరలిస్తున్నారు. వేగ నిరోధకాల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటోంది. ప్రజలకు, వాహన చోదకులకు రాళ్లు కనిపించకుండా టిప్పర్లపై నీలం రంగు పట్టలు కప్పి తరలిస్తున్నారు. చీరాల ప్రాంతంలో జన సంచారం ఎక్కవగా ఉన్న ప్రదేశంలో వేగంగా రాకపోకలు సాగిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. మార్టూరు ప్రాంతం నుంచి గ్రానైట్ రాళ్లను తరలిస్తున్నారు. భారీ లోడుతో లారీలు పెద్ద సంఖ్యలో తిరగడం వల్ల పర్చూరు-మార్టూరు మధ్య రహదారి, వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో పర్చూరు-కారంచేడు మధ్య నిర్మాణం దెబ్బతింది. పర్చూరు నుంచి జాగర్లమూడి వైపు కొన్ని చోట్ల అడుగు నుంచి రెండడుగుల వరకు రోడ్డు కుంగింది. కొన్నిచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వంతెనలు వణుకుతున్నా పట్టించుకోవడం లేదు. రెండు నెలల వ్యవధిలో రహదారుల రూపురేఖలు మారి అధ్వానంగా మారడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ అంచులకు పైగా రాళ్లు వేయడం వల్ల మార్గంమధ్యలో జారి పడిపోతున్నాయి. అలా పడే సమయంలో వెనుక నుంచి వాహనాలు వస్తున్నా, లేదా ప్రజలున్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం యద్దనపూడి మండలం జాగర్లమూడి వద్ద పెద్ద రాయి లారీ నుంచి జారిపడింది. అదృష్టవశాత్తు రోడ్డు అంచున పడడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. తక్షణం రవాణా అధికారులు అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
తక్షణం చర్యలు తీసుకుంటాం
అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెడతాం. రవాణా శాఖ అధికారులతో రహదారులపై ప్రత్యేక తనిఖీలు చేయిస్తాం. జరిమానాలు విధించడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం. చంద్రశేఖర్రెడ్డి, జిల్లా రవాణాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434