పోలీసులకు చిక్కిన డ్రగ్స్ ముఠా
ఇప్పటివరకూ రైళ్లు, బస్సులు, బైకులు, దుస్తులు, కూరగాయల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తుండడం చూశాం.
ఐదుగురి అరెస్టు.. 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను చూపుతున్న డీసీపీ శ్రీనివాస్రావు,
ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నర్సింగ్రావు, ఎస్ఓటీ సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే, మూసాపేట: ఇప్పటివరకూ రైళ్లు, బస్సులు, బైకులు, దుస్తులు, కూరగాయల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తుండడం చూశాం. మాదాపూర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులకు పట్టుబడ్డ ముఠా అదృశ్య విధానంలో డ్రగ్స్ చేరవేస్తోంది. ‘డెడ్ డ్రాప్’ పేరుతో కొత్త విధానానికి తెరలేపింది. డ్రగ్స్ సరఫరాదారు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలుండవు. డ్రగ్స్ అవసరమైన వ్యక్తులు ఫోన్ సందేశం ద్వారా సరకు అడగ్గానే.. ఒక ప్రాంతం పేరు, సమయం చెబుతారు. వినియోగదారు చెప్పిన సమయానికి అక్కడికెళ్లి తీసుకోవాలి. డబ్బు ఆన్లైన్లో పంపించాలి. ఈ ముఠాలోని ఐదుగురిని మాదాపూర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారంతా పాతికేళ్లలోపు కుర్రాళ్లు కావడం గమనార్హం. రూ.లక్ష విలువైన ఎండీఎంఏ, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నాడు. సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ రియాజ్, అదనపు డీసీపీ నారాయణ, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ టి.నర్సింగ్రావుతో కలిసి బాలానగర్ డీసీపీ టి.శ్రీనివాసరావు కూకట్పల్లి ఠాణాలో వివరాలు వెల్లడించారు.
చిన్నవయసులోనే మత్తు బానిసలు : ఏపీలోని విజయవాడకు చెందిన దాసరి హరికృష్ణ అలియాస్ హరి(21) గచ్చిబౌలిలో ఉంటూ చెఫ్గా పనిచేస్తున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసగా మారిన ఇతను డ్రగ్స్ విక్రేతగా మారాడు. ఇతనితోపాటు ఇటీవల డిగ్రీ పూర్తిచేసిన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నెమలికంటి పవన్కుమార్ అలియాస్ పవన్(24), కళాశాల విద్యార్థి జంగం కిరణ్తేజ్(20), అమర రఘునందన్ సాంబమూర్తి అలియాస్ రఘు(23), కాగ్నిజెంట్లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన సాయికుమార్(24) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రఘునందన్ గతంలో బెంగళూరులో ఉన్నప్పుడు నైజీరియా దేశానికి చెందిన డ్రగ్స్ సరఫరాదారు అలీ పరిచయం అయ్యాడు. ఇతని ద్వారా రఘు డ్రగ్స్ కొనుగోలు చేస్తాడు. రఘు హైదరాబాద్ వచ్చాక డ్రగ్స్ కోసం నైజీరియన్ను సంప్రదించగా అతడు ఓ మహిళ ఫోన్ నంబరు ఇచ్చాడు. ఆమె ద్వారా ఈ ముఠా డ్రగ్స్ కొనుగోలు చేస్తుంది. కూకట్పల్లి ఐడీఎల్ చెరువు బతుకమ్మ ఘాట్ వద్ద డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.
ఎవరా అదృశ్య మహిళ?
డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఈ ఐదుగురు నిందితులకు ఒక మహిళ తరచూ సరకు అందిస్తున్నట్లు సమాచారం. యువకులు సరకు అవసరమైనప్పుడు మహిళ ఫోన్కు వాట్సాప్ సందేశం పంపిస్తారు. ఆ వెంటనే ఆమె ఎక్కడ ఏ ప్రాంతంలో డ్రగ్స్ ఉంచుతుందో చెబుతుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన ఫొటో కూడా పంపిస్తుంది. సరిగ్గా ఆమె చెప్పిన సమయానికి యువకులు ఆ నిర్మానుష్య ప్రదేశానికెళ్లి డ్రగ్స్ తీసుకోవాలి. ప్రత్యక్ష సంబంధాల్లేకుండా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదృశ్య మహిళ వివరాలు పట్టుబడ్డవారి దగ్గరా లేవని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఆచూకీ లభిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం