logo

‘భారాస విజయానికి కృషి చేద్దాం’

చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ విజయం సాధించేందుకు కార్యకర్తలు, నాయకులు గట్టిగా కృషి చేయాలని చెప్పారు.

Published : 29 Mar 2024 03:26 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు: చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ విజయం సాధించేందుకు కార్యకర్తలు, నాయకులు గట్టిగా కృషి చేయాలని చెప్పారు. గురువారం తాండూరులోని తన నివాసంలో నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాలతో పాటు తాండూరు పట్టణంలోని ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం నిర్వహించే నియోజకవర్గ భారాస విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరయ్యే సమావేశానికి తరలి రావాలన్నారు.  

పార్టీ మారుతున్నాననే వదంతులు నమ్మొద్దు: భారాసను వీడి తాను వేరే పార్టీలో చేరుతున్నానని వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గిట్టని వారు కొందరు చేస్తున్న ప్రచారాన్ని అసలు పట్టించు కోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని