logo

కుమారుడి చేతిలో తండ్రి హతం

మద్యం తాగి వచ్చి తల్లిపై దాడికి యత్నించిన తండ్రిపై తనయుడు చేసిన ఎదురుదాడిలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం సూరారం గ్రామానికి చెందిన దుర్గం చంద్రయ్య (45) హతమయ్యాడు.

Published : 15 Jan 2022 03:57 IST

మద్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని కర్రతో దాడి


చికిత్స పొందుతున్న అరవింద్‌

వెల్గటూరు, న్యూస్‌టుడే: మద్యం తాగి వచ్చి తల్లిపై దాడికి యత్నించిన తండ్రిపై తనయుడు చేసిన ఎదురుదాడిలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం సూరారం గ్రామానికి చెందిన దుర్గం చంద్రయ్య (45) హతమయ్యాడు. వెల్గటూరు ఎస్సై నరేష్‌ కథనం మేరకు మృతుడు చంద్రయ్య నిత్యం మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇదే క్రమంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. చంద్రయ్య భార్య లక్ష్మిని తిడుతూ కొట్టేందుకు వెళ్లాడు. అక్కడే ఉండి ఇది గమనించిన పెద్ద కుమారుడు దుర్గం పవన్‌ కర్రతో చంద్రయ్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు. మద్యం మత్తులో ఉన్న ఇతడిని కుటుంబ సభ్యులు రాత్రి అలాగే వదిలేశారు. శుక్రవారం తెల్లవారుజామున చూసే సరికి చంద్రయ్య రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన నిందితుడు పవన్‌ ఇంటి నుంచి పరారయ్యాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని