రాత్రి విధుల మినహాయింపు
రాత్రి ఎనిమిది గంటలలోపు ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు ముగించుకునేలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ఉత్తర్వు మహిళా కండక్టర్లకు వరంగా మారాయి. ఇది సీఎం హామీ మేరకు అమలవుతున్నా, ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయడంతో
మహిళా కండక్టర్లకు సౌకర్యం..
టికెట్లు అందజేస్తున్న మహిళా కండక్టర్
ధర్మపురి, న్యూస్టుడే: రాత్రి ఎనిమిది గంటలలోపు ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు ముగించుకునేలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ఉత్తర్వు మహిళా కండక్టర్లకు వరంగా మారాయి. ఇది సీఎం హామీ మేరకు అమలవుతున్నా, ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వారం రోజులుగా పూర్తి స్థాయిలో అమలవుతోంది. రాత్రిళ్లు విధుల్లో పాల్గొంటున్న మహిళా కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర విభాగాల్లో పని చేస్తున్న వారికి వరంగా మారాయి. గతంలో ఆర్టీసీ కార్మికులతో సీఎం చర్చించిన సందర్భంలోనే దీనికి కార్మిక సంఘాలు దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి మహిళా ఉద్యోగి రాత్రి 8 గంటలలోపు పనులు పూర్తి చేసుకుని విధులను ముగిస్తున్నారు. గతంలో మహిళా కండక్టర్ల కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఎదురుచూసే వారు. అర్ధరాత్రి, విధులు చేయడం ఎంతో అసౌకర్యంగా ఉండేది. ప్రస్తుతం రాత్రి 8 లోపే మహిళలు తమ ఇంటికి చేరే అవకాశం రావడంతో ఎంతో వరంగా మారింది. జగిత్యాల డీఎం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఈ విధానం చాలా రోజులుగా అమలవుతున్నా, తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటల వరకే విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఎంతో సౌకర్యంగా ఉంటోంది
- కొనపర్తి లక్ష్మి(కండక్టర్)
23 ఏళ్లుగా ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. అయితే రాత్రి 9 దాటిందంటే ఎంతో అసౌకర్యంగా ఉండేది. ఇంటి పనులు, కుటుంబ బాధ్యత జ్ఞాపకం వచ్చేవి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేయడంతో రాత్రి 8.30 వరకు విధులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుతున్నాం. ఎంతో సౌకర్యంగా ఉంటోంది. మహిళ ఉద్యోగులకు మరిన్ని వసతులు కల్పించాలి.
మహిళలకు వరమే
- కొండ్ర స్రవంతి (కండక్టర్ )
ఇప్పటి వరకు రాత్రి దూర ప్రయాణాల విధులు మహిళ ఉద్యోగులకు ఇబ్బందే. మాది సొంత గ్రామం గొల్లపల్లి. విధులు పూర్తి చేసుకుని ఇంటికి చేరే సరికి చాలా ఆలస్యమయ్యేది. ఇంటి పనులు పిల్లల సంరక్షణ ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం రాత్రి 8 గంటల వరకు విధులు పూర్తి చేసుకుని, 8.30 వరకే ఇంటికి చేరుతున్నాం. మహిళలకు వరంగానే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
[ 26-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.