మండే ఎండల్లో గిరగిరా మీటర్లు
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్ల వాడుతుండటంతో మీటర్లు
జిల్లాలో పెరుగుతున్న విద్యుత్తు వినియోగం
ప్రాధాన్య రంగాలకు గణనీయంగా డిమాండ్
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్ల వాడుతుండటంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. డిమాండ్కు అనుగుణంగా సరఫరాకు విద్యుత్తు శాఖ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవనున్నాయన్న వాతావరణ సూచనలతో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ విద్యుత్తుకు డిమాండ్ అధికంగా ఉండనుంది. కొత్త కనెక్షన్లు కూడా పెరగనున్నాయి. ఈ క్రమంలో వచ్చే సీజన్కు అనుగుణంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అంతరాయం లేకుండా అందించేలా శాఖాపరమైన చర్యలు చేపట్టారు. కొత్త కనెక్షన్ల మంజూరులో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
భారీగా పెరిగిన కనెక్షన్లు
జిల్లావ్యాప్తంగా 30 వేల వ్యవసాయ బావులుండగా, బోరుబావులతో కలిపి 2 లక్షలకు పైగా మోటార్లున్నాయి. 24 గంటల విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో ఏటికేడు కొత్త కనెక్షన్ల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. 2020లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 368 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 2021 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 402 కొత్త కనెక్షన్లు మంజూరు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 300 మంజూరు చేశారు. జూన్, జులై, ఆగస్టు నెలాఖరు వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యరంగాల వారీగా విద్యుత్తు కనెక్షన్లు కూడా గణనీయంగా పెరిగాయి. మార్చిలో మొత్తం కనెక్షన్లు 3,21,735 ఉండగా ఏప్రిల్లో 3,22,571కు పెరిగాయి. అంటే నెల రోజుల్లో 836 కనెక్షన్లు పెరిగాయి. ఇక మే నెలలో 18వ తేదీ వరకే 3,23,181 కనెక్షన్లకు పెరిగాయి. అంటే 610 కనెక్షన్లు అధికంగా చేరాయి.
డిమాండ్కు అనుగుణంగా సరఫరా
* గత సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకు మొత్తం 211.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అందుబాటులో ఉండగా 345.28 మిలియన్ యూనిట్లు వినియోగమయ్యాయి. అంటే 133.69 మిలియన్ యూనిట్లు అదనంగా అవసరమయ్యాయి.
* ఈ ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటివరకు 492.6 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉండగా ఇప్పటికే 478.6 మి.యూ. వాడకం జరగగా నెలాఖరు వరకు రెట్టింపు వినియోగం కానుంది.
* ఈ ఏడాది మార్చిలో లక్షిత డిమాండ్ 219.4 మిలియన్ యూనిట్లు కాగా, 204.82 మిలియన్ యూనిట్ల వాడకం జరిగింది.
* ఏప్రిల్లో 171.6 మి.యూ.డిమాండ్ ఉంటే 175.06 మి.యూ. వినియోగం జరిగింది. 4 మిలియన్ యూనిట్లు ఎక్కువగా వినియోగమైంది.
* ఇక మే నెలలో 101.68 మిలియన్ యూనిట్ల లక్ష్యం ఉండగా ఇప్పటికే 98.02 మిలియన్ యూనిట్ల వాడకం పూర్తయింది. నెలాఖరు వరకు లక్ష్యానికి కంటే రెట్టింపు వినియోగించే అవకాశాలున్నాయి.
* వచ్చే వానాకాలంలో జిల్లాలో మొత్తం 2,86,755 ఎకరాల్లో పంటలు సాగు చేయనుండగా ఇందులో వరి 1,93,200 ఎకరాల్లో వేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
సమస్యల సత్వర పరిష్కారం: బొంకూరి సుదర్శన్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ
ప్రస్తుతం వ్యవసాయ, ఇతర ప్రాధాన్య రంగాలకు 24 గంటల పాటు ఆటంకాలు లేకుండా విద్యుత్తు అందిస్తున్నాం. వచ్చే వానాకాలం సీజన్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. అడిగిన వెంటనే నిబంధనల ప్రకారం కొత్త కనెక్షన్లు ఇస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు వచ్చినా స్థానిక కార్యాలయాల్లో సంప్రదిస్తే వెంటనే పరిష్కరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక