logo

భూ తగాదాలో కత్తితో దాడి

వీణవంకలో జరిగిన భూ ఘర్షణలో గెల్లు కౌశిక్‌ అనే యువకుడు కత్తితో దాడి చేయగా గెల్లు మల్లయ్య, నోముల అక్షయ్‌లకు తీవ్ర గాయాలైనట్లు వీణవంక ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. వీణవంకలో అక్షయ్‌ తన ఇంటి స్థలాన్ని బొంగోని రాజుకు విక్రయించుకోగా హద్దులు చూపించేందుకు

Published : 18 Aug 2022 06:46 IST

ఇద్దరికి తీవ్ర గాయాలు

గాయపడ్డ గెల్లు మల్లయ్యయాదవ్‌

వీణవంక,న్యూస్‌టుడే: వీణవంకలో జరిగిన భూ ఘర్షణలో గెల్లు కౌశిక్‌ అనే యువకుడు కత్తితో దాడి చేయగా గెల్లు మల్లయ్య, నోముల అక్షయ్‌లకు తీవ్ర గాయాలైనట్లు వీణవంక ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. వీణవంకలో అక్షయ్‌ తన ఇంటి స్థలాన్ని బొంగోని రాజుకు విక్రయించుకోగా హద్దులు చూపించేందుకు బుధవారం భూమి వద్దకు వచ్చారు. ఇదే స్థలాన్ని గతంలో అక్షయ్‌ తాత గెల్లు సమ్మయ్యకు విక్రయించగా స్థలం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భూ వివాదంపై కొంత మంది పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరుగుతుండగా గెల్లు సమ్మయ్య కుమారుడు గెల్లు కౌశిక్‌ కత్తితో ఒక్కసారిగా దాడి చేసి గెల్లు మల్లయ్య, నోముల అక్షయ్‌లను కొట్టగా తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. 108 వాహనంలో మల్లయ్యను కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్షయ్‌ తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని