Super Star Krishna: జిల్లా యాదిలో సూపర్స్టార్
‘ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ..’ ‘తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా’తదితర పాటలతో అలరించిన సూపర్స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ధ్రువతారగా ఎదిగారు.
న్యూస్టుడే, కరీంనగర్ సాంస్కృతికం
‘ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ..’ ‘తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా’తదితర పాటలతో అలరించిన సూపర్స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ధ్రువతారగా ఎదిగారు. దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో ఉండి ప్రజలను అలరించారు. ఆ మహా నటుడికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆత్మీయానుబంధం ఉంది. ఆయన ఈ లోకాన్ని వీడిపోవడంతో సినీ అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషుల్లో విషాదం నెలకొంది. ఆయన చిత్రాలు..పాటలు, రాజకీయ కార్యక్రమాలను స్మరించుకుంటూ జిల్లావాసులు నివాళులర్పించారు.
స్థానిక దర్శకులతో కలిసి పని చేసి..
కొత్తపల్లికి చెందిన కె.కె.రెడ్డి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. కృష్ణ కె.కె.రెడ్డితో కలిసి సుదీర్ఘంగా కలిసి ఉన్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలు తీసేందుకు కె.కె.రెడ్డితోపాటు తొలిముద్దు చిత్ర దర్శకుడు రుష్యేందర్రెడ్డితో ఆత్మీయ అనుబంధం పెంచుకున్నారు. మెట్పల్లి ప్రచారంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో కె.కె.రెడ్డి ఇంట్లో, అతని సోదరుడు రాంరెడ్డి ఇంట్లో భోజనం చేసి స్థానికులతో మాట్లాడినట్లు రుష్యేందర్రెడ్డి తెలిపారు. ‘మేరి అవాజ్ సునో’, తదితర చిత్రాలతోపాటు కృష్ణతో ‘నా ఇల్లే..నా స్వర్గం’ చిత్రం తీశారని రుష్యేందర్రెడ్డి పేర్కొన్నారు. పద్మాలయ స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కృష్ణతో చిత్ర పరిశ్రమ ఒక యుగం ముగిసిందన్నారు.
పలువురి సంతాపం..
సినీ నటుడు కృష్ణ మృతిపై సాహితీకారులు, కళాకారులు సంతాపం ప్రకటించారు. సమైక్య సాహితీ అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్, కఫిసో అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, లక్ష్మీగౌతమ్, సినీ విమర్శకులు వారాల ఆనంద్, మాస్క్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ అనసూరి భూనాథాచారి, చిరంజీవి రాష్ట్ర యువత ఉపాధ్యక్షుడు మిడిదొడ్డి నవీన్కుమార్ సంతాపం తెలిపారు.
సంభవం చిత్రీకరణకు 18 రోజులు జిల్లాలో..
కరీంనగర్కు చెందిన పి.రామ్మోహన్రావు నిర్మాతగా సినీ హీరో కృష్ణతో 1998లో సంభవం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం 18 రోజులు జిల్లాలోనే ఉన్నారు. కమాన్ చౌరస్తా, కోర్టు చౌరస్తా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద కొన్ని దృశ్యాలతోపాటు ఒక పాట చిత్రీకరించారు. ఆ రోజుల్లో ఈ చిత్ర షూటింగ్తోపాటు సినీ నటులను చూసేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలివచ్చారు. కృష్ణతోపాటు సుమన్, రోజా, అలీ, శ్రీహరిలాంటి నటులు ఇక్కడే ఉండి షూటింగ్లో పాల్గొన్నారని నిర్మాత రామ్మోహన్రావు తెలిపారు. నాలుగేళ్ల కిందట తన కూతురు వివాహానికి కృష్ణ హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో కృష్ణలాంటి వ్యక్తిత్వం, మంచితనం అందరి అభిమానం చూరగొన్న వ్యక్తి అని పేర్కొన్నారు. 1997లో సొంత బ్యానర్లో దర్శకుడు ఎన్.శంకర్తో తీసిన ఎన్కౌంటర్ సినిమా విజయోత్సవానికి శ్రీనివాస థియేటర్కు వచ్చారు.
మెట్పల్లితో అనుబంధం
సూపర్స్టార్ కృష్ణ మరణంతో మెట్పల్లి ప్రాంత అభిమానుల్లో విషాదం నెలకొంది. మెట్పల్లితో ఆయనకున్న అనుబంధాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు. మెట్పల్లిలో 1998లో జరిగిన ఉప ఎన్నికలో కృష్ణ కాంగ్రెస్ అభ్యర్థి కొమిరెడ్డి జ్యోతిదేవి తరఫున ప్రచారం చేశారు.
-న్యూస్టుడే, మెట్పల్లి
అభిమానులకు ప్రాధాన్యం
1991లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణ మంథనికి వచ్చారు. పెద్దపల్లి నుంచి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటస్వామికి మద్దతుగా సతీమణి విజయనిర్మలతో కలిసి కృష్ణ వచ్చారు. కళాశాల మైదానంలో జరిగిన సభలో అభిమాన సంఘాల నాయకులతో కలిసి ఫొటోలు దిగారు. కృష్ణ సేన అధ్యక్షుడు కొమురోజు శ్రీనివాస్, ప్రస్తుత మున్సిలర్ కౌన్సిలర్ వి.కె.రవి ఆయనకు రక్త తిలకం దిద్ది అభిమానం చాటుకున్నారు.
-న్యూస్టుడే, మంథని గ్రామీణం
సతీమణితో కలిసి కాకాకు మద్దతుగా..
1991 పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వెంకటస్వామి తరపున హుజూరాబాద్లో ప్రచార సభకు సినీనటులు కృష్ణ, విజయనిర్మల హాజరయ్యారు.
-న్యూస్టుడే, హుజూరాబాద్ గ్రామీణం
ప్రచారంలో భాగంగా..
1989 శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డికి మద్దతుగా నటుడు కృష్ణ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సతీమణి విజయనిర్మల కూడా కృష్ణ వెంట పాల్గొన్నారు.
-న్యూస్టుడే, పెద్దపల్లి
నాటి క్షణాలు గుర్తు చేసుకుంటూ.
* తిమ్మాపూర్కు చెందిన నటుడు కేతిరెడ్డి మల్లారెడ్డి సూపర్ స్టార్తో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. మంచి మనసున్న కృష్ణ దూరమవడం పరిశ్రమకు తీరని లోటన్నారు. ‘గండికోట రహస్యం’లో ప్రధాన విలన్ పాత్రలో నటించానన్నారు. అలాగే కృష్ణ సొంత బ్యానర్ అన్నయ్య సీరియల్లో ఇన్స్పెక్టర్గా నటించానన్నారు.
* చెన్నైలో ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్ర షూటింగ్ సమయంలో కృష్ణతో కలిసి మాట్లాడానని పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల రామేశం గుర్తు చేసుకున్నారు.
* పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు వచ్చిన సందర్భంగా జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్గౌడ్, పీచర కృష్ణమాచార్యులు పలుమార్లు కలిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?