నిర్వహణ బరువు.. స్వచ్ఛత కరవు
జిల్లాలోని కొన్ని సర్కారు బడుల్లో మూత్రశాలలు, మరుగు దొడ్ల సౌకర్యం కొరవడింది. ప్రత్యామ్నాయం లేక ఒంటికి, రెంటికొస్తే విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి.
న్యూస్టుడే, మెట్పల్లి
జిల్లాలోని కొన్ని సర్కారు బడుల్లో మూత్రశాలలు, మరుగు దొడ్ల సౌకర్యం కొరవడింది. ప్రత్యామ్నాయం లేక ఒంటికి, రెంటికొస్తే విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించినా నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో నిధుల కొరతతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోగా మరికొన్నిచోట్ల నీటి వసతి లేకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 783 ఉండగా 57,511 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో బాలురు 29,902 మంది, బాలికలు 27,609 మంది ఉన్నారు.
ఆదేశాలు కాగితాలకే పరిమితం..
పాఠశాలల పరిశుభ్రత బాధ్యతను గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో పురపాలక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ సమయంలో కొద్ది రోజుల పాటు పంచాయతీ, పుర కార్మికులు పాఠశాలలను శుభ్రం చేసి వదిలారు. రెండేళ్లుగా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 7.30 నుంచి సాయంత్రం పాఠశాల సమయం ముగిసే వరకు విధుల్లో ఉండేవారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రం చేయడంతో పాటు పిల్లలకు తాగునీరు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం పారిశుద్ధ్య సిబ్బంది లేక పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రంగా మారాయి. పలు బడుల్లో తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులే పారిశుద్ధ్య కార్మికులుగా మారాల్సిన దుస్థితి. పంచాయతీ, పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమతమయ్యాయి. పురపాలికలు, పాఠశాలల్లో వసతులు, నిర్వహణకు పంచాయతీలు పురపాలక సంఘాలకు విడుదలయ్యే 14, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత వినియోగించుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసినా పంచాయతీ అధికారులు స్పందించడం లేదు.
ఈ చిత్రంలోని మరుగుదొడ్లు మల్లాపూర్ మండలంలోని ఓ పాఠశాలకు చెందినవి. ఇవి శిథిలావస్థకు చేరడంతో పాటు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి. ఆరు బయటకు లేదా ఇళ్లకు వెళ్తున్నారు. ఇక్కడ 50కి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఇవి మెట్పల్లి పట్టణంలోని ప్రాథమిక పాఠశాల మరుగుదొడ్లు. ఇక్కడ 46 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరుగుదొడ్లు ఉన్నా వాటికి తలుపులు లేవు. ఒంటికి, రెంటికి ఖాళీ స్థలానికి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల ఆవరణంతా పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగాయి. చెరువు సమీపంలో పాఠశాల ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
నిధులు కేటాయించాలి
- తులసి ఆగమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, యూటీఎఫ్
ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నాయి. నిర్వహణ లోపంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు పాఠశాలల్లో నీటి సమస్యతోపాటు మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పురపాలక, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించినా పాఠశాలల వైపు చూడడంలేదు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలి. ప్రతి పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలి.
పంచాయతీ, పుర కార్మికులకు పారిశుద్ధ్య బాధ్యత
- జగన్మోహన్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, జగిత్యాల
పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీ, పురపాలికలకు అప్పగించింది. పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించాల్సి ఉన్నా అలా జరగడం లేదు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరగా మరికొన్నింటిలో నీరు, విద్యుత్తు సమస్యలు ఉన్నాయి. శిథిలావస్థకు చెందిన మరుగుదొడ్ల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!