దివ్యాంగులకు స్లాట్లు దొరక్క ఇబ్బందులు
రామగుండానికి చెందిన దివ్యాంగుడు రాజయ్యకు ప్రతి రోజూ మీసేవ కేంద్రానికి వెళ్లి రావడమే పని. దివ్యాంగులకు ఆసరా పింఛను మంజూరు కావాలంటే వైకల్య ధ్రువీకరణ కావాలి.
కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పనతోనే జాప్యం
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
* రామగుండానికి చెందిన దివ్యాంగుడు రాజయ్యకు ప్రతి రోజూ మీసేవ కేంద్రానికి వెళ్లి రావడమే పని. దివ్యాంగులకు ఆసరా పింఛను మంజూరు కావాలంటే వైకల్య ధ్రువీకరణ కావాలి. ఇందుకోసం సదరం శిబిరంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండగా రాజయ్య నిత్యం వస్తున్నా పని కావడం లేదు. ప్రభుత్వం సాప్ట్వేర్లో మార్పులు, చేర్పులు చేస్తున్న క్రమంలో తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో స్లాట్ ఎప్పుడు బుక్ అవుతుందో తెలియక ఆయన చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
* పెద్దపల్లికి చెందిన తాత్కాలిక ఉద్యోగి రమేశ్ విధి నిర్వహణలో రెండు కాళ్లూ కోల్పోయి మంచానికే పరిమితమయ్యారు. మూడు నెలలుగా స్లాట్ బుకింగ్పై రేపు, మాపు అని చెబుతున్నారే గానీ చేయడం లేదని వాపోతున్నారు. వాస్తవానికి గతంలోనే ఈయనకు పింఛను రావాల్సి ఉన్నా ఆలస్యంగా సదరం శిబిరానికి హాజరయ్యారు. దీంతో 3 నెలలుగా స్లాట్ బుక్ కాకపోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.
స్లాట్ బుకింగ్పై ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవిస్తున్న దివ్యాంగుడు (పాత చిత్రం)
అర్హులు వేలల్లో.. అవకాశం 300లోపే..
జిల్లావ్యాప్తంగా మొత్తం 1,09,976 మందికి ఆసరా పథకం కింద నెలనెలా పింఛన్లు అందిస్తున్నారు. ఇందులో 13,546 మంది దివ్యాంగులు నెలకు రూ.3,106 చొప్పున పింఛను పొందుతున్నారు. వీరికి అదనంగా 1,169 మంది కొత్తవారు పింఛను ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖకు మూడు నెలలకు ఒకసారి 300 స్లాట్ల చొప్పున విడుదల చేస్తుంది. పరీక్షలు చేయించుకోవాల్సిన దివ్యాంగుల సంఖ్య వేలల్లో ఉంటే కోటా మాత్రం 300 దాటడం లేదు. స్లాట్ లభిస్తేనే తమకు వచ్చిన తేదీల్లో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సదరం శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. శారీరక వైకల్యం, దృష్టి, వినికిడి తదితర శారీరక, మానసిక రుగ్మతలున్నవారికి సంబంధిత వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉంటేనే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. జిల్లాలో డిసెంబరు మొదటి వారంలోనే గతేడాది స్లాట్ బుకింగ్స్ నిర్వహించారు. కొత్త సంవత్సరంలో జనవరి-మార్చి వరకు ఉండే స్లాట్ను గత ఏడాది డిసెంబరు రెండో వారంలోనే ప్రకటించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షణ..
- శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి
గతంలో 4 రకాల వైకల్యం కలిగిన వారు మాత్రమే సదరం శిబిరానికి హాజరయ్యేవారు. ప్రస్తుతం మరో 21 రకాల శారీరక, మానసిక వైకల్యాలతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించారు. ఇందుకోసం కొత్త సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. ఆ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలో కోటా ప్రకారం స్లాట్లు అందించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..