ఆశలన్నీ.. పెద్దపద్దు పైనే...!
పార్లమెంటులో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టనున్న పెద్దపద్దు ఎలా ఉంటుంది..? ఏయే వర్గాలకు మేలు చేసేలా వరాలుంటాయి అన్న ఆశ అందరి మదిలో మెదులుతోంది.
ఈనాడు, కరీంనగర్
పార్లమెంటులో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టనున్న పెద్దపద్దు ఎలా ఉంటుంది..? ఏయే వర్గాలకు మేలు చేసేలా వరాలుంటాయి అన్న ఆశ అందరి మదిలో మెదులుతోంది. మూడేళ్ల కిందట కరోనా విజృంభణతో వివిధ రంగాలు అతలాకుతలమయ్యాయి.. గత బడ్జెట్లలో పెద్ద ప్రాజెక్టుల కల నెరవేరేలా ఉమ్మడి జిల్లాకు కాసులు కురవలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా పద్దుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. దక్కాల్సిన వాటా పెరగాలన్న ఆకాంక్ష అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది..
దారుల దశ తిరిగేనా!
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి వివిధ జిల్లాలకు అనుసంధానంగా ఉన్న పలు జాతీయ రహదారులకు నిధులు రావాల్సి ఉంది. దేశ ప్రధాని స్వయంగా గతేడాది నవంబరు 12న గోదావరిఖని బహిరంగ సభలోనే జిల్లాలోని కీలకమైన జాతీయ రహదారి నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని ఎల్కతుర్తి - సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణకు రూ.578.85 కోట్ల ప్రాజెక్ట్కు పచ్చజెండా ఊపారు. ఈ బడ్జెట్లో ఆ నిధులు మంజూరవడంతోపాటు కీలకమైన వరంగల్- కరీంనగర్లోని 68 కి.మీ.లకు రూ.2,146.86 కోట్లు, కరీంనగర్- జగిత్యాల మార్గంలో 59 కి.మీ దారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఇదివరకే మంజూరు చేసిన రూ.2151.63 కోట్లను ఈ బడ్జెట్లో అందించాల్సి ఉంది. ఇవే కాకుండా.. కరీంనగర్- సిరిసిల్ల- పిట్లం, సిరిసిల్ల- సిద్దిపేట - జనగాం, జగిత్యాల- మెట్పల్లి- నిజామాబాద్, నిర్మల్- ఖానాపూర్- జగిత్యాల, కరీంనగర్- మానకొండూర్- వీణవంక- భూపాలపల్లి, రాయపట్నం- కరీంనగర్- కోదాడ మార్గాలను భారత్మాల పథకం కింద అభివృద్ధి పరుస్తామన్న ప్రకటనలు నెరవేరే నిర్ణయాలు వస్తే ఉమ్మడి జిల్లాలో రోడ్లు విస్తరిస్తాయి. రవాణా మెరుగుపడుతుంది.
పథకాలు ప్రయోజనమనేలా..
రైతులు, యువత, మహిళలు, కార్మికులకు మేలు చేసేలా ఉన్న కొన్ని కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాలకు దండిగా నిధులను కేటాయిస్తే జిల్లాలకు మేలు జరగనుంది. ముఖ్యంగా వ్యవసాయాధారిత జిల్లాలో కర్షకులకు బీమా వర్తింపు సహా సేంద్రియ సాగుకు ఊతమిచ్చే నిర్ణయాలు, కిసాన్ కార్డులు, ఆధునిక యంత్రాల ఊరట లాంటి పలు ప్రయోజనాలు పార్లమెంటు వేదికగా వెలువడాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్లోని ఈ-నామ్ వ్యవస్థ గాడిలో పడాల్సిన అవసరముంది. జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ సమావేశం(దిశ)లోని దాదాపు 42 కేంద్ర పథకాలకు సంబంధించిన నిధుల విడుదల జాప్యం తీరేలా కేటాయింపులు ఘనంగా ఉండాలి. ఆస్పత్రులకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కాసుల మూటలు అంది వైద్య సేవలు మరింత మెరుగుపడాలి. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్సిటీకి రావాల్సిన కేంద్ర వాటా నిధులు పూర్తిగా అందితే అభివృద్ధికి దోహదపడనున్నాయి. నేషనల్ రూరల్ లైవ్హుడ్ మిషన్, రూర్బన్ పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, పోషణ్ అభియాన్, సుగమ్య భారత్ అభియాన్, బేటీ బచావో- బేటీ పడావో, ఆదర్శ్ గ్రామ్ యోజన, స్వచ్ఛభారత్ మిషన్, ప్రధానమంత్రి సడక్ యోజన, దీన్దయాళ్ గ్రామీణ విద్యుదీకరణ యోజనలో జిల్లాకు పెద్ద వాటా అందితే మేలు కలగనుంది.
రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో?
పలు రైల్వే ప్రాజెక్ట్లకు ఈ బడ్జెట్లోనైనా ఆశించినన్ని కాసులు అందితే అభివృద్ధికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనోహరాబాద్- కొత్తపల్లి మార్గానికి రూ.400 కోట్ల వరకు కేటాయింపులు ఉంటేనే.. ఈసారి సిరిసిల్ల జిల్లా వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగే వీలుంటుంది. కరీంనగర్- మానకొండూర్- కాజీపేట కొత్త మార్గం కోసం పెట్టిన ప్రతిపాదనలు ఆమోదిస్తే ప్రయాణ సౌకర్యం మెరుగవనుంది. వందేభారత్ రైళ్లను పలు మార్గాల్లో పొడిగిస్తామనే నిర్ణయాల్లో భాగంగా కొత్త మార్గాల ప్రకటనలో జమ్మికుంట- రామగుండం మార్గం ఉంటే కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు దిల్లీకి దగ్గరి దారిగా మారే వీలుంటుంది. కొత్త రైళ్ల కేటాయింపులు, ఎక్స్ప్రెస్ల నిలుపుదల, ఆర్వోబీల నిర్మాణాలు, ట్రాక్ల పునరుద్ధరణ, స్టేషన్ల ఆధునికీకరణలాంటి మంచి పనులకు మోక్షం లభించాలని ఉమ్మడి జిల్లావాసులు కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి