వడగళ్ల వాన.. తప్పని హైరానా..!
జిల్లాలో అకాల వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తర- దక్షిణ ద్రోణి ప్రభావంతో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి చల్లని గాలుల ప్రభావం జిల్లాలో కనిపించింది.
జమ్మికుంట ఆర్వోబీ ప్రాంతంలో కురుస్తున్న వర్షం
ఈనాడు, కరీంనగర్: జిల్లాలో అకాల వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తర- దక్షిణ ద్రోణి ప్రభావంతో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి చల్లని గాలుల ప్రభావం జిల్లాలో కనిపించింది. సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో వడగళ్లతో కూడిన వర్షంతో అపార నష్టం వాటిల్లింది. భారీ పరిమాణంలో ఉన్న రాళ్లను చూసి రైతులు కంగు తిన్నారు. వరిపంటతోపాటు కూరగాయల పంటపొలాలకు ఈ వర్షంతో నష్టం వాటిల్లింది. శుక్రవారం కొన్ని మండలాల్లో అధికంగా జల్లులు కురిశాయి. శనివారం గంగాధర, రామడుగు, శంకరపట్నం, మానకొండూర్, హుజూరాబాద్, వీణవంక, చిగురుమామిడి, జమ్మికుంట మండలాల్లో పడిన వానతో ప్రజలకు హైరానా తప్పలేదు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పిడుగుపాటుకు నిలిచిన సరఫరా
భగత్నగర్: పిడుగుపాటుకు నగరంలోని పలు ప్రాంతాలకు శనివారం సాయంత్రం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు అధికారులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. భారీ శబ్ధంతో పడిన పిడుగు ధాటికి నగరంలోని హౌజింగ్ బోర్డులోని 132 కేవీ విద్యుత్తు కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించారు.
హుజూరాబాద్, జమ్మికుంటల్లో భారీ వర్షం
హుజూరాబాద్ పట్టణం, జమ్మికుంట : హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో శనివారం రాత్రి భారీగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో జమ్మికుంట పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ఆర్వోబీకి ఇరువైపులా వర్షపు నీరు నిలిచింది. గాంధీ చౌరస్తా వద్ద అదే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షపునీరు భారీగా చేరింది. అలాగే హుజూరాబాద్ పట్టణంలో ఓ మోస్తరుగా కురిసిన వర్షంతో రోడ్డుపై నీరు నిలిచింది.
దెబ్బతిన్న వరి పంట
మానకొండూర్ : మద్దికుంట- గంగారం రహదారిపై పడిపోయిన చెట్టు
మానకొండూర్ : మానకొండూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగళ్ల వర్షం కురవడంతో రైతన్నలు ఆందోళనలో మునిగిపోయారు. పలు ప్రాంతాల్లో వరి పంట దెబ్బతింది. మద్దికుంటలో ఈదురుగాలులకు రహదారిపై తాటిచెట్టు కూలిపోయింది. మద్దికుంట - గంగారం రహదారిపై చెట్టు విరిగి పడడంతో రాకపోకలకు అవస్థలు పడ్డారు. మానకొండూర్, పచ్చునూర్, వెల్దిలో రాత్రి భారీ వర్షంతోపాటు వడగళ్లు కురిసాయి. కొండపల్కల, చెంజర్ల, అన్నారంలో వర్షం కురిసింది. దీంతో ఈదురుగాలులకు వరి పొలాలు నేలవాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వీణవంక : వీణవంక మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతోపాటు వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులకు బ్రాహ్మణపల్లి గ్రామంలో తాటి చెట్టు విరిగి గాజుల రాజేశ్ ఇంటిపై పడటంతో ఇల్లు కూలింది. ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు అయినట్లు గ్రామస్థులు తెలిపారు.
నేలవాలిన పంటలు
జమ్మికుంట మండలంలో కురిసిన వడగళ్లు
జమ్మికుంట : అకాల వర్షంతో మొక్కజొన్న పంట నేల వాలగా, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగళ్ల వాన కురియటంతో అన్నదాతలు ఆవేదనకు లోనయ్యారు. జమ్మికుంట మండలం, విలాసాగర్, పాపయ్యపల్లిలో కురిసిన వడగళ్లు పెద్దగా ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. సాయంత్రం 6 గంటల తరవాత వర్షం కురవడంతో పంటల పరిస్థితి ఏంటో తెలియక రైతులు ఆందోళనలో మునిగిపోయారు. అకాల వర్షంతో ఇప్పటికే జమ్మికుంట మండలంలో 696 ఎకరాలు, ఇల్లందకుంట మండలంలో 1,215 ఎకకాల మొక్కజొన్న పంట నేల వాలినట్లు వ్యవసాయాదికారులు అంచనా వేశారు. శనివారం కురిసిన వడగళ్ల వానతో జరిగిన నష్టం అధికారులు పర్యవేక్షణ అనంతరం తెలియనున్నది.
రామడుగులో కంకర రాళ్లను తలపించేలా..
రామడుగు, న్యూస్టుడే: కంకర రాళ్లను తలపించే పరిమాణంలో రామడుగు మండలంలోని గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా మొదలైన వడగళ్ల వర్షం ఆరగంట పాటు కురిసింది. రామడుగు, వెదిర, దేశరాజ్పల్లి, పందికుంటపల్లి, కిష్టాపూర్, షానగర్, కోరిటపల్లి, గోలిరామయ్యపల్లి, మోతె, కొక్కెరకుంట, రుద్రారం, రంగశాయిపల్లి, దత్తోజిపేట గ్రామాల్లో వడగళ్లు మంచు పొర మాదిరిగా పరచుకున్నాయి. పొలాల్లో వడగళ్ల వర్షంతో చిరుపొట్ట దశలోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందారు.
గంగాధర మండలంలో
గంగాధర: గంగాధర మండలంలో పెద్ద పరిమాణంలో వడగళ్లు కురవడంతో వరి, మొక్కజొన్న, కూరగాయలతోపాటు మామిడి తోటలు దెబ్బతిని నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గంగాధర, లక్ష్మీదేవిపల్లి, మధురానగర్, నాగిరెడ్డిపూర్, కురిక్యాల, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, గట్టుబూత్కూర్, గర్శకుర్తి, ఆచంపల్లి, గోపాల్రావుపల్లి, మల్లాపూర్, కొండన్నపల్లి, తదితర గ్రామాల్లో వడగళ్ల వానతో వందలాది ఎకరాల్లో పొట్ట దశలో ఉన్న వరి, కంకులు ఈనిన వరి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. మామిడి కాయలు నేలరాలి అపార నష్టం జరిగింది. గట్టుబూత్కూర్లో ఇద్దరు వ్యక్తులకు చెందిన ఇళ్లపై వడగళ్లు పడటంతో సిమెంట్ రేకులకు రంధ్రాలుపడ్డాయి. ఇంట్లో ఉన్న టీవీ పగిలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అనిల్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు రేకులు కూడా ధ్వంసమయ్యాయి.
చొప్పదండి మండలంలో
చొప్పదండి: చొప్పదండి మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం సాయంత్రం రాళ్లవాన కురిసి పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు.
చెర్లబూత్కూర్లో...
కరీంనగర్ గ్రామీణం: అకాల వర్షానికి తోడు శనివారం సాయంత్రం కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి, చెర్లబూత్కూర్, ఇరుకుల్ల, జూబ్లీనగర్ తదితర గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. ఈ కారణంగా పొట్టదశలో ఉన్న వరి పొలాలు కొంతమేర దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం