బల్దియాల్లో సన్నద్ధం
ప్రభుత్వం రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ఏటా హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతుంది.. పట్టణాల్లో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలున్నాయి. జిల్లాలో ఈఏడాది హరితహారం ఏవిధంగా చేపట్టాలో అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
హరితహారంలో 7,21,817 మొక్కల లక్ష్యం
కోరుట్ల నర్సరీలో ఏపుగా పెరిగిన మొక్కలు
న్యూస్టుడే, కోరుట్ల: ప్రభుత్వం రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ఏటా హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతుంది.. పట్టణాల్లో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలున్నాయి. జిల్లాలో ఈఏడాది హరితహారం ఏవిధంగా చేపట్టాలో అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలోని పట్టణాల్లో ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. పట్టణాల్లో ఏ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి, ఇళ్లలో ప్రజలతో ఎలాంటి మొక్కల నాటించాలని బల్దియా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లకిరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో, ఇతర చోట్ల మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తిస్తున్నారు. రోడ్లకిరువైపులా గతేడాది నాటిన మొక్కలు ఎండిపోతే వాటిస్థానంలో నూతనంగా మొక్కలు నాటించనున్నారు. పట్టణ ప్రకృతి వనంలో మరిన్ని మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రగతిలో అభివృద్ధి చేసిన సీసీరోడ్లు, విస్తరించిన రోడ్ల కిరువైపులా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
పట్టణ నర్సరీల్లో పెంపకం
మూడేళ్లుగా పట్టణాల్లోనే ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టారు. పట్టణాల్లో నాటేందుకు, ఇళ్లల్లో ప్రజలతో నాటించేందుకు కావాల్సిన మొక్కలు ఎన్నో ముందుగానే అంచనా రూపొందించి పట్టణ నర్సరీల్లో పెంచుతున్నారు. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులను వెచ్చించి శాశ్వత నర్సరీలను నెలకొల్పారు. నర్సరీల చుట్టూ గోడలు, కంచెలను నిర్మించి నీటి, నీడ సౌకర్యం ఏర్పాటు చేశారు. మొక్కల పెంపకం కోసం నాణ్యమైన మట్టి, విత్తనాలను తెప్పించి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. పట్టణ నర్సరీల్లో మొక్కలు త్వరగా ఎదిగేందుకు సేంద్రియ ఎరువుల వినియోగం, ఇతర అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవడంతో మొక్కలు పెరిగి అందుబాటులో ఉన్నాయి.
ఇంటింటికీ 2 నుంచి 5
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయిల్ పట్టణంలోని నర్సరీల్లో నాటేందుకు కావాల్సిన అన్ని రకాల మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. నివాస ప్రాంతాల్లో, ఇళ్లలో ప్రజలతో మొక్కలు నాటిచేందుకు ఇంటికి 2 నుంచి 5 పూల, పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నారు. పట్టణ నర్సరీలో పెంచుతున్న మొక్కలు సరిపోకపోతే ప్రైవేటు నర్సరీల నుంచి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ నర్సరీల్లో గులాబీ, మల్లెపువ్వు, మందార, గోరింటా, చామంతి, తులసీ, పారిజాతం, చామంతి, కోనోకార్పస్, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, అల్లనేరేడు, చింత, వేప, గుల్మోహర్, కోనెకార్పస్, చైనాబాదం, వాటర్ ఆపిల్, కానుగ, బాదాం, మారేడు, ఎర్రచందనం, శ్రీగంధం, బాహినియా, కదంబం, సెల్టోఫాం, టేకొమా, టేకు, స్పాథొడియా, నెమలినార, నీలగిరి ఇలా సుమారు 35 రకాల మొక్కలను పెంచారు.
గులాబీ మొక్కలు అందిస్తాం..
మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ నర్సరీలో ఏడాది నుంచి మొక్కలు పెంచుతున్నాం. 6 అడుగుల వరకు పెరిగిన మొక్కలను నాటడంతో తొందరగా నాటుకుని ఎదుగుతున్నాయి. గతంలో మొక్కల సేకరణకు తీవ్రంగా శ్రమించేవాళ్లం. ప్రస్తుతం పట్టణ నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కోరుట్ల పట్టణంలో గలాబీ మొక్కలను ఇంటింటికీ పంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.
అయాజ్, కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!