స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు.
సంఘాల సమావేశాల్లో మహిళలకు ఓటు చైతన్యం
ఇంటింటికీ ప్రాముఖ్యం తెలిపేలా అధికారుల కార్యాచరణ
కాల్వశ్రీరాంపూర్ సమావేశంలో పాల్గొన్న స్వశక్తి మహిళలు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మహిళల పోలింగ్ శాతం రెట్టింపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ నెల 8 నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఓటు చైతన్యం కల్పించడానికి అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘం సమావేశాల్లో ఓటరు నమోదు, ఓటు ప్రాముఖ్యం తదితర అంశాలను చర్చిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నారు.
సంపూర్ణ అవగాహన
మహిళా సంఘాలు, గ్రామ, మండల, జిల్లా సమాఖ్య సంఘాలకు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రుణాలు, కిస్తుల చెల్లింపులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తున్నారు. సంఘంలో ఒక్కరికి ఆపదొచ్చినా అందరూ కలిసి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మహిళల్లో ఐక్యత కనిపిస్తోంది. సమావేశాల్లో ఓటు హక్కు వినియోగం, సమర్థులకే పట్టం కట్టాలనే అంశాలను సభ్యులకు వివరిస్తున్నారు. అభివృద్ధికి బాటలు వేసే వారికే ప్రాధాన్యం కల్పించాలని సూచిస్తున్నారు. ఊరంతా ఓటు వేసేలా సంపూర్ణంగా అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. ఒక్క సభ్యురాలికి ఓటు ప్రాముఖ్యం తెలిస్తే ఆమె ఇంట్లోని అందరినీ పోలింగ్ కేంద్రానికి రప్పించవచ్చన్న భావనతో అధికారులు కార్యాచరణ చేపట్టారు.
ఆలోచన రేకెత్తించేలా..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు రాబట్టుకోవడానికి యత్నిస్తారు. ఈ క్రమంలో తాయిలాలకు ఆశ పడొద్దని, ‘ఓటు అమ్ముకుంటే మన భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టినట్టే’నంటూ అధికారులు సభ్యుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులైన సభ్యులకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. సంఘాల్లో చర్చించిన ప్రతి అంశాన్నీ గ్రామంలోని మిగతా మహిళలకు తెలియజెప్పేలా సభ్యులను సిద్ధం చేస్తున్నారు. నిజాయతీగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ వివరిస్తున్నారు. సెర్ప్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు సమావేశాల్లో పాల్గొంటూ మహిళలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
ఫలిస్తున్న ప్రయత్నం
ఉమ్మడి జిల్లాలో 58 మండల సమాఖ్యలు, 1,955 గ్రామైక్య, 49,440 స్వశక్తి సంఘాలుండగా మొత్తం 5,46,953 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓటుహక్కు వినియోగంలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దీంతో ఏటా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ మహిళలు భారీగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడంతో ఈసారి అలా కాకూడదని ప్రతి ఊరిలో ఓటు ప్రాముఖ్యంపై వివరిస్తున్నారు. సంఘాల్లోని సభ్యులందరూ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి నైతిక ఓటింగ్ సందేశాన్ని చేరవేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్
[ 01-05-2024]
ఓపీ రిజిస్ట్రేషన్ కోసం వరుసలో నిల్చునే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం నుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. -
లక్ష ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ లక్ష్యం
[ 01-05-2024]
‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
పదిలో మెరుగైన ఫలితాలు
[ 01-05-2024]
జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. -
ఆ రెండు పార్టీలు ఒక్కటే
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపాలు ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, -
పదిలో ఎనిమిదో స్థానం
[ 01-05-2024]
జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధికారుల సమష్టి సహకారంతో 96.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 102 జడ్పీ ఉన్నత, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 6 మహాత్మా జ్యోతిబా, 1 తెలంగాణ గురుకులం, -
పోలింగ్ కేంద్రం.. సమగ్ర సమాచారం
[ 01-05-2024]
ఓటర్లకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ నుంచి మొదలుకొని పోలింగు నిర్వహణ వరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు -
పెరిగిన వినియోగం.. గృహజ్యోతికి దూరం
[ 01-05-2024]
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. -
ఆ రెండు పార్టీలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన భాజపా, భారాసలు
[ 01-05-2024]
భారతీయ జనతా పార్టీ, భారాసలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. -
మోదీ బహిరంగ సభ విజయవంతానికి పిలుపు
[ 01-05-2024]
వేములవాడ పట్టణంలో మే 8న జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
పది ఫలితాల్లో అదుర్స్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పది ఫలితాల్లో 98.27 శాతంతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. -
శ్రమజీవి గుండె సడి వినండి
[ 01-05-2024]
ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకొని జీవించే కార్మికులు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దాటినా హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. కష్టజీవులు, కర్మ వీరులకు కనీస వసతుల కల్పనలో పాలకులు విఫలమవుతున్నారు. -
గంజాయి చోరీ కేసులో ఆరుగురి అరెస్టు
[ 01-05-2024]
పోలీసుస్టేషన్ నుంచి గంజాయి దొంగిలించిన కేసులో మంగళవారం ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘుచందర్ వివరాలు వెల్లడించారు. -
వాట్సాప్.. ఎన్నికలపై అప్డేట్
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చర్యలు తీసుకుంటోంది. -
68 మందిపై అనర్హత వేటు
[ 01-05-2024]
2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో వివిధ పార్టీల నుంచి ఏడుగురు బరిలో దిగగా, మిగతా వారు స్వతంత్రులు.