logo

Kumaraswamy: ఇక కన్నీరు కార్చను: కుమారస్వామి

ఇకముందు తాను కన్నీరు కార్చేదిలేదని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గతంలో అనేక సందర్భాల్లో కన్నీళ్ల పర్యంతమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ సంఘటనలు తీవ్ర విమర్శలకు

Published : 07 Dec 2021 08:30 IST


మండ్యలో మాట్లాడుతున్న కుమారస్వామి తదితరులు

మండ్య, న్యూస్‌టుడే : ఇకముందు తాను కన్నీరు కార్చేదిలేదని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గతంలో అనేక సందర్భాల్లో కన్నీళ్ల పర్యంతమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ సంఘటనలు తీవ్ర విమర్శలకు దారితీసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగని తాను సంఘటనలకు స్పందించకుండా గుండెను రాయిచేసుకున్నట్లు భావించరాదని చెప్పారు. విధానపరిషత్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతునిచ్చేదీ, తటస్థంగా ఉండేదో అనే విషయాన్ని మంగళవారం ప్రకటిస్తానని చెప్పారు. తాను భాజపాకు మద్దతునిస్తానని ఇప్పటివరకు ఎక్కడా ప్రకటించలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. దళ్‌ కుటుంబ రాజకీయాల గురించి విమర్శించే ముందు కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచిస్తే మంచిదని సలహా ఇచ్చారు. తండ్రీ కొడుకులు శాసనసభ్యులుగా ఉన్న విషయాన్ని విస్మరించారా అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని