హెచ్చెల్సీ కింద జోరుగా పంటల సాగు
తుంగభద్ర జలాశయం చరిత్రలో రెండోసారి హెచ్చెల్సీ కాలువకు మార్చి వరకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు టి.బి.బోర్డు అధికారులు రైతులకు భరోసా ఇవ్వడంతో ఆయకట్టు కింద 70 నుంచి 80 రోజుల్లో వచ్చే పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు.
ఏపుగా పెరిగిన జొన్న పంట
బళ్లారి, న్యూస్టుడే: తుంగభద్ర జలాశయం చరిత్రలో రెండోసారి హెచ్చెల్సీ కాలువకు మార్చి వరకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు టి.బి.బోర్డు అధికారులు రైతులకు భరోసా ఇవ్వడంతో ఆయకట్టు కింద 70 నుంచి 80 రోజుల్లో వచ్చే పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎల్లెల్సీ కింద రైతులు వరి నాటగా, హెచ్చెల్సీ కాలువలకు జనవరి 11న నీటిని విడుదల చేయడంతో జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర, పెసర, అలసంద తదితర పంటలు సాగు చేశారు. జనవరి 11 నాటికి 90 టి.ఎం.సి.ల నీరు జలాశయంలో నిల్వ ఉండటంతో, హెచ్చెల్సీకి మార్చి 15 వరకు నీటిని విడుదల చేస్తే స్వల్పకాలిక పంటలు సాగు చేస్తామని రైతులు ఒత్తిడి తేవడంతో ఫిబ్రవరి 28 వరకు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. జలాశయంలో నీటి లభ్యతను బట్టి మార్చి 15 వరకు విడుదల చేస్తామని షరతు పెట్టడంతో హెచ్చెల్సీ పరిధిలో పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు.
స్వల్పకాలిక పంటలకు అనుకూలం
రైతులు 70 నుంచి 80 రోజుల్లో దిగుబడి వచ్చే జొన్న, మొక్కజొన్న, కొర్రలు, సజ్జ, మరికొంత మంది రైతులు ఉల్లి, పెసర, అలసంద తదితర పంటలను వేశారు. కొందరు అంతర పంటలను సాగు చేశారు. ఇప్పటికే మొలకెత్తిన పంటలు దాదాపు అడుగు ఎత్తులో ఉన్నాయి. మార్చి 15 వరకు కాలువకు నీటిని విడుదల చేస్తే పంటలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు శ్రీనివాసులు, యర్రికాంత్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్లో పంటలు కోల్పోవడంతో రబీలో అయినా కలిసొస్తుందని ఆశగా చెప్పారు. ప్రస్తుతం జొన్న, మొక్కజొన్న, కొర్ర పంటలకు అనుకూలమని కృష్ణానగర్ క్యాంపునకు చెందిన రైతు శ్రీనివాసరావు తెలిపారు.
మిరపలో అంతరపంటగా కొర్ర సాగు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా బాలల సంబరమే
[ 10-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు. -
కారాగారంలో కునుకే కరవాయె
[ 10-05-2024]
కిడ్నాప్ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్లో ఉన్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు. -
మూలకణ మార్పిడిలో అద్భుతం
[ 10-05-2024]
భారతదేశం- జర్మనీ దేశాల వాతావరణం, రెండు దేశాల ప్రజల జన్యు నిర్మాణాలకు అంతులేని వ్యత్యాసం ఉంటుంది. సృష్టిలో మానవులంతా ఒక్కటే అంటూ నిరూపించింది ఓ మూలకణ మార్పిడి సంఘటన. -
తల్లీ, కుమారుడి సాధన
[ 10-05-2024]
ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన జ్యోతి (38), ఆమె కుమారుడు సీబీ నితిన్ ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. నితిన్ ఏ+ గ్రేడుతో 582 మార్కులు దక్కించుకోగా, అతని తల్లి టీఆర్ జ్యోతి 250 మార్కులతో సీ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. -
డెంగీ లక్షణాలతో బాలుడి మృతి
[ 10-05-2024]
డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే. -
టేకూరు కృష్ణమూర్తి పేరిట తపాలా కవర్
[ 10-05-2024]
భారతీయ రెడ్క్రాస్ సంస్థ, తపాలా శాఖ, మేధా డిగ్రీ కళాశాల, విమ్స్ ఆసుపత్రి, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గురువారం శ్రీ మేధా డిగ్రీ కళాశాల సభాభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా -
ముంపు గాయానికి మందు
[ 10-05-2024]
రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లోతట్టు ప్రదేశాలను ముంపు నుంచి సంరక్షించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె చేపట్టే పథకాలకు ప్రపంచ బ్యాంకు రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. -
సిట్ నిరుపయోగం: కుమార
[ 10-05-2024]
అశ్లీల వీడియోల పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆక్రోశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్