నవచైతన్యంతో కరోనాపై పోరు
‘కరోనా నియంత్రణలో కర్ణాటక విజయం సాధించింది. ప్రపంచం మొత్తం కొవిడ్ను నియంత్రించేందుకు సతమతమవుతున్న సమయంలోనే మనం కొవిడ్కు వ్యతిరేకంగా అత్యంత గట్టి పోరాటం చేశాం’ అని గవర్నర్ థావర్
గణతంత్ర వేడుకల వేదికపై గవర్నర్ ప్రకటన
పరేడ్ మైదానంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తున్న
గవర్నర్ థావర్చంద్ గహ్లోత్
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : ‘కరోనా నియంత్రణలో కర్ణాటక విజయం సాధించింది. ప్రపంచం మొత్తం కొవిడ్ను నియంత్రించేందుకు సతమతమవుతున్న సమయంలోనే మనం కొవిడ్కు వ్యతిరేకంగా అత్యంత గట్టి పోరాటం చేశాం’ అని గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ప్రకటించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే కర్ణాటకలో కొవిడ్ మరణాలు తక్కువేనని చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మానిక్షా పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, వివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. రోగులకు చికిత్స అందించడంలో శ్రమించిన ఫ్రంట్ లైన్ వారియర్లు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకున్నామని గుర్తు చేశారు. కొవిడ్ సమయంలోనే మన సామర్థ్యాన్ని పెంచేలా ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల ఉత్పాదనను పెంచుకున్నామని చెప్పారు. వార్ రూమ్ల నిర్వహణ, టెలిమెడిసిన్ తదితరాలకు సాంకేతిక సంపద సహకరించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పురస్కారాన్ని ఇచ్చిందన్నారు. లాక్డౌన్లో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయని ప్రశంసించారు. నవ చైతన్యం, కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టామని ప్రకటించారు.
బెంగళూరు పరేడ్ మైదానంలో వివిధ దళాల కవాతు
* దేశంలో ప్రగతిపథంలో వెళుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటని గవర్నర్ గహ్లోత్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని అమృత గ్రామపంచాయతీల్లో అమృత రైతు, అమృత గ్రామీణ గృహ నిర్మాణ పథకం, అమృత నిర్మల, అమృత శాల మౌలిక సదుపాయాల కార్యక్రమం, అమృత అంగన్ వాడీ కేంద్రాలు తదితర 14 కార్యక్రమాలను 2023 ఆగస్టు 15 నాటికి విజయవంతంగా నిర్వహిస్తామని వివరించారు. వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు జలాశయాల అభివృద్ధికి 2021-22 ఏడాదిలో ప్రభుత్వం రూ.1,472 కోట్లను కేటాయించి, పనులు చేస్తుందని తెలిపారు. మొబైల్, సాంకేతిక ఆధారిత పంట సమీక్షను గ్రామ స్థాయిలో యువత సాయంతో అమలులోకి తీసుకు వచ్చామని చెప్పారు. పంట సమీక్షలకు 12.76 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకోగా, 256.95 లక్షల హెక్టార్ల ప్రదేశాన్ని ఈ సమీక్ష పరిధిలోకి తీసుకు వచ్చామన్నారు. రైతుల కుటుంబాల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.4.41 కోట్లను 16,176 మంది విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు. ఆరోగ్య శాఖలో ఆరు నెలల్లోనే 746 మంది సాంకేతికనిపుణులు, 1,048 మంది వైద్యులను నియమించినటన్లు వివరించారు. కార్మికులు, అసంఘటిత కార్మిక వలయాలకు చెందిన 26.73 లక్షల కార్మికులకు రూ.1,136.05 కోట్ల సహాయ ధనాన్ని తమ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. రెండో లాక్డౌన్ సమయంలో 11.82 లక్షల మంది కార్మికులకు తలా రూ.2 వేల చొప్పున రూ.236.46 కోట్లు చెల్లించామని తెలిపారు. దేశంలో ఉద్యాన శాఖ సాధనల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉందన్నారు. ఉద్యాన శాఖకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో 20,634 మంది రైతులకు లబ్ధి చేకూరిందని వివరించారు. పోలీసులు అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర రూ.14.23 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.13.39 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. వైర్లెస్ పరికరాల కొనుగోలుకు రూ.15.23 కోట్లు విడుదల చేశామని వివరించారు. వెనుకబడిన వర్గాలు, మహిళలు, బాలింతలు, బాలల సంక్షేమానికి విడుదల చేసిన నిధులను గవర్నర్ విశ్లేషించారు.
ఓపెన్ టాప్ జీపులో వెళుతూ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న గవర్నర్
* మానిక్షా పరేడ్ మైదానంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బులెట్ ఫ్రూఫ్ గ్లాస్ లేకుండానే బుధవారం ప్రసంగించారు. తాను ప్రసంగించే సమయంలో బులెట్ ఫ్రూఫ్ గ్లాస్ లేకుండా చూడాలని అధికారులకు ఆయన ముందుగానే సూచించారు. పరేడ్ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంలో ముఖ్యమంత్రి, గవర్నర్ ఇతర ప్రముఖులు ప్రసంగించే సమయంలో భద్రత కోసం బులెట్ ప్రూఫ్ గ్లాస్ను అడ్డుగా ఉంచడం తరచుగా కొనసాగుతున్న ప్రక్రియ.
* రెండు దశకాలుగా గణతంత్ర వేడుకలకు వ్యాఖ్యాతలుగా శంకర్ ప్రకాశ్, అపర్ణ వ్యవహరించేవారు. తనకు అవకాశం ఇవ్వడం లేదని కొద్ది రోజుల కిందట మరో మహిళా వ్యాఖ్యాత డాక్టర్ గిరిజ ముఖ్యమంత్రి నివాసం వద్ద ధర్నాకు దిగారు. దీంతో.. ఈసారి ఆమెకు వ్యాఖ్యాతగా అవకాశం కల్పించారు.
* కొవిడ్ నిబంధనలు జారీలో ఉండడంతో మైదానంలో నిర్వహించవలసిన అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రముఖులు మినహాయించి, పౌరులకు మైదానంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించలేదు.
విధానసౌధ వద్ద పోలీసుల ఆనంద హేల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలివిడతకు ఎండపోటు
[ 08-05-2024]
కన్నడనాట ఎన్నికల ఘట్టాన్ని సూర్యదేవుడు వెంటాడాడు. తొలి విడతను మించి.. గ్రామీణ ప్రాంతాలున్న ఉత్తర కర్ణాటకలో- మలివిడతలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందనుకుంటే ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ప్రస్తావనార్హం. -
పెన్డ్రైవ్ల వెనుక సిద్ధు సర్కారు
[ 08-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియో కేసును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా మార్చుకుందని జనతాదళ్ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. -
ఓటంటేనే వారికి ప్రాణం!
[ 08-05-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హిక్కద్ కురువె కాళీనది మధ్య ఒక ద్వీపంలో ఉంటుంది. అక్కడ పోలింగ్ బూత్ లేకపోవడంతో గ్రామస్థులు బోటు ఎక్కి అంకోలాకు వచ్చి తమ హక్కు వినియోగించుకున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
[ 08-05-2024]
హాసన లైంగిక వేధింపుల కేసులో కీలకమైన పెన్డ్రైవ్ వ్యవహారంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న భాజపా నేత దేవరాజేగౌడను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ రేస్కోర్సు రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. -
ఓటరు దేవుడు.. మొండికేశాడు
[ 08-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొదటి విడతలో 69 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ విడత పూర్తి గ్రామీణ ప్రాంతాలున్నా.. -
ఓటంటేనే ఓ వేడుక!
[ 08-05-2024]
ఓ వైపు ఎండలు.. మరో వైపు ఎన్నికల్లో ఓటేయాల్సిన బాధ్యత. ఈ రెండింటితో బాధ్యతతోనే ముందడుగు వేశారు మహిళలు, యువకులు, కొత్త ఓటర్లు! -
ఆసాంతం.. ప్రశాంతం
[ 08-05-2024]
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నిక సోమవారం ఉదయం సజావుగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు వారంతా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. -
అక్క ఇంట్లో చెల్లి చోరీ!
[ 08-05-2024]
సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ దయానంద్ విలేకర్లకు వివరించారు. -
తలుపులు వేసుకుని..
[ 08-05-2024]
హుబ్బళ్లిలోని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం తలుపులు వేసుకుని భోజనం చేశారు. -
అడ్డగోలుగా గర్భవిచ్ఛితి
[ 08-05-2024]
పాండవపుర ఆరోగ్య శాఖ వసతి గృహాల సముదాయంలో లభించిన పిండాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్