దంచికొట్టిన వర్షం.. వణికిన జనం!
బళ్లారి జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ ఏడాదిలో ఇదే పెద్ద వర్షం కావడంతో రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. ఎడతెరిపి లేని వానతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. బళ్లారి నగరంలో పలు లోతట్టు ప్రదేశాల్లోకి వర్షపునీటితో కలిసి మురుగునీరు చేరడంతో స్థానిక ప్రజలు రాత్రంతా జాగారం చేశారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
ప్రజాజీవనం అస్తవ్యస్తం
బళ్లారి: రూపనగుడి కాలనీలో ఇళ్ల్ల మధ్య నిలిచిన మురుగునీరు
బళ్లారి, న్యూస్టుడే: బళ్లారి జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ ఏడాదిలో ఇదే పెద్ద వర్షం కావడంతో రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. ఎడతెరిపి లేని వానతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. బళ్లారి నగరంలో పలు లోతట్టు ప్రదేశాల్లోకి వర్షపునీటితో కలిసి మురుగునీరు చేరడంతో స్థానిక ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో బీభత్సం సృష్టించింది. రహదారులపై నీరు పరుగులు తీసింది. నగరం రూపనగుడి రహదారిలోని కట్టకింద కాలనీ, తదితర ప్రాంతాల్లో రాజ కాలువలో వర్షపునీరు, మురుగు సమీపంలోని కాలనీలోని ఇళ్లలోకి చేరడంతో వస్తువులు, ఆహార సామగ్రి తడిసిముద్దయ్యాయి. రాజు కాలువల్లో ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయక పోవడంతో చెత్తాచెదారం అడ్డుపడి నీరంతా ఇళ్లలోకి చేరినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలు ఆందోళన చేయడంతో పాలికె అధికారులు అక్కడికి చేరుకొని మురుగునీటిని మళ్లించారు. బండిమోట, కౌల్బజార్లోని ఆశ్రయ కాలనీ, మిలర్పేటెలోకి పలు కాలనీలు, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరి ఇబ్బందులు పడ్డారు. డీసీ కార్యాలయం, రిజిస్ట్రార్ కార్యాలయం ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాల తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. సత్యనారాయణ పేటె, దుర్గమ్మ గుడి, రంగమందిరం వద్ద ఉన్న రైల్వే వంతెనల కింద నిలిచిన వర్షపునీటితో రాకపోకలకు ఆటంకం కలిగింది. కురుగోడు, సండూరు, సిరుగుప్ప తాలూకాల్లోనూ భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 37 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా ఆరు గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
సిరుగుప్ప: తాలూకా వ్యాప్తంగా బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రారావి హగరినది, కరూరు, హగలూరు, తదితర గ్రామాల పరిధిలో వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. వర్షాలకు పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయినట్లు తహసీల్దార్ మంజునాథ స్వామి తెలిపారు.
కంప్లి: కంప్లి తాలూకాలో బుధవారం రాత్రి 38.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎమ్మిగనూరు, హంపాదేవనహళ్లి, శ్రీరామ రంగాపురం, సుగ్గేనహళ్లి గ్రామాల్లో ఒక్కో ఇల్లు పడిపోయినట్లు తహసీల్దార్ గౌసియా బేగం తెలిపారు.
హొసపేటె: ఏకధాటిగా కురిసిన వర్షాలకు ప్రముఖ పర్యాటక క్షేత్రం హంపీలోని పలు స్మారకాలు జలమయమయ్యాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కురిసిన వర్షాలతో హంపీలో జనజీవనం స్తంభించింది.కృష్ణ ఆలయం, సాలు మంటపాలు, కృష్ణ బజార్, విజయవిఠల ఆలయాలను నీరు చుట్టుముట్టింది. భూగర్భ శివాలయం చెరువులా మారింది.
సింధనూరు : రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వానతో సింధనూరు తాలూకాలోని గ్రామాలు అతలాకుతలమయ్యాయి. తాలూకాలోని మస్కి అసెంబ్లీ క్షేత్ర పరిధి గ్రామాల్లో నష్టం వాటిల్లింది. అనేక విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని గ్రామాల్లో గురువారం సాయంత్రం వరకూ చీకటి రాజ్యమేలింది.
రైల్వే వంతెన కిందకు చేరిన వర్షపునీరు
సిరుగుప్ప: పాఠశాల ఆవరణలో నిలిచిన నీటిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సోమలింగప్ప
కురుగోడు తాలుకాలో పడిపోయిన ఇల్లు
హంపీలో మునిగిన కృష్ణ ఆలయ ప్రాంగణం
సింధనూరు : తిడగోళ-కోళబాళ గ్రామాల మధ్య వాగు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!