బరిలో దిగే వీరులెవరో?
విధానసభ నుంచి విధాన పరిషత్తుకు నిర్వహించనున్న ఏడు నియోజకవర్గాలకు మూడు పార్టీల అభ్యర్థులను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. నామపత్రాలను దాఖలు చేసేందుకు మంగళవారం చివరి రోజు. మే 17 నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : విధానసభ నుంచి విధాన పరిషత్తుకు నిర్వహించనున్న ఏడు నియోజకవర్గాలకు మూడు పార్టీల అభ్యర్థులను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. నామపత్రాలను దాఖలు చేసేందుకు మంగళవారం చివరి రోజు. మే 17 నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉండగా ఇప్పటి వరకు మూడు పార్టీలూ అభ్యర్థులను ఖరారు చేయనే లేదు. జనతాదళ్ టిక్కెట్టు దక్కించుకునేందుకు టి.ఎ.శరవణ, వీరేంద్ర పోటీ పడుతున్నారు. అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత దళపతి దేవేగౌడకు అప్పగించారు. మధ్యకర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తే వీరేంద్రకు అవకాశం దక్కుతుంది. మరోవైపు కమలదళం అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని భాజపా కేంద్ర సమితి తీర్మానించనుంది. భాజపా, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసి, ఆమోదం కోసం తమ పార్టీల హైకమాండ్ నేతలకు పంపించారు. సోమవారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటిస్తారని జాతీయ పార్టీల రాష్ట్ర నాయకులు వేచి చూస్తున్నారు. విధానసభలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా భాజపా నాలుగు, కాంగ్రెస్ రెండు, దళ్ ఒక స్థానాన్ని సులభంగా గెల్చుకునేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీలు అదనంగా తలా ఒక అభ్యర్థిని బరిలో దించితే ఓటింగ్ అనివార్యమవుతుంది. ఎమ్మెల్సీలు లక్ష్మణ సవది, ఆర్.బి.తిమ్మాపుర, అల్లవీరభద్రప్ప, హెచ్.ఎం.రమేశ్ గౌడ, వీణా అచ్చయ్య, కె.వి.నారాయణ స్వామి, లెహర్సింగ్ల పదవీ కాలం జూన్ 14కు ముగియనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.