నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా సముదాయ భవనాలు
జిల్లాలో సముదాయ భవనాలు సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సరస్వతి కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు అధికారులకు సూచించారు.
డా.బాబు జగ్జీవన్రాం భవనం, విగ్రహం
బళ్లారి, న్యూస్టుడే: జిల్లాలో సముదాయ భవనాలు సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సరస్వతి కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు అధికారులకు సూచించారు. జిల్లా యంత్రాంగం, పంచాయతీ, సమాజ సంక్షేమ శాఖ సంయుక్తంగా స్థానిక నల్లచెరువులోని 4.31 ఎకరాల విశాలప్రదేశంలో ఏర్పాటు చేసిన డా.బాబు జగ్జీవన్రాం నూతన భవనం, విగ్రహ ప్రతిష్ఠాపనను మంత్రి ప్రారంభించారు. బాబు జగ్జీవన్రాం దేశం గౌరవించే మహావ్యక్తి. హరిత విప్లవం కోసం శ్రమించిన నేత, అంటురాని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు. ఆయన పేరు మీద నిర్మించిన భవనం, విగ్రహం ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం బుడకట్టు సముదాయం అభివృద్ధికి రూ.15వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. దళిత, గిరిజన వర్గాల సముదాయం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం రూ.4,500 కోట్ల నుంచి రూ.9500 కోట్లకు పెంచే ఆలోచన ఉందన్నారు. గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు హెచ్.హనుమంతప్ప, లోక్సభ మాజీ సభ్యురాలు శాంత, వివిధ సంక్షేమ శాఖల అధికారులు సతీశ్, సకీనా, సురేష్, శాషు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పింజార్ రంజాన్సాబ్ విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి, తదితరులు
పింజార్ రంజాన్సాబ్ విగ్రహం ప్రతిష్ఠ
నగరంలోని స్థానిక డా.రాజ్కుమార్ రహదారిలోని కేంద్ర గ్రంథాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కర్ణాటక ఏకీకరణకు పోరాటం చేసిన పహిల్వాన్ కప్పగల్ పింజార్ రంజాన్సాబ్ విగ్రహాన్ని మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యులు, అధికారులు ఆవిష్కరించారు.
జగ్జీవన్రాం భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యులు, అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా బాలల సంబరమే
[ 10-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు. -
కారాగారంలో కునుకే కరవాయె
[ 10-05-2024]
కిడ్నాప్ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్లో ఉన్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు. -
మూలకణ మార్పిడిలో అద్భుతం
[ 10-05-2024]
భారతదేశం- జర్మనీ దేశాల వాతావరణం, రెండు దేశాల ప్రజల జన్యు నిర్మాణాలకు అంతులేని వ్యత్యాసం ఉంటుంది. సృష్టిలో మానవులంతా ఒక్కటే అంటూ నిరూపించింది ఓ మూలకణ మార్పిడి సంఘటన. -
తల్లీ, కుమారుడి సాధన
[ 10-05-2024]
ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన జ్యోతి (38), ఆమె కుమారుడు సీబీ నితిన్ ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. నితిన్ ఏ+ గ్రేడుతో 582 మార్కులు దక్కించుకోగా, అతని తల్లి టీఆర్ జ్యోతి 250 మార్కులతో సీ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. -
డెంగీ లక్షణాలతో బాలుడి మృతి
[ 10-05-2024]
డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే. -
టేకూరు కృష్ణమూర్తి పేరిట తపాలా కవర్
[ 10-05-2024]
భారతీయ రెడ్క్రాస్ సంస్థ, తపాలా శాఖ, మేధా డిగ్రీ కళాశాల, విమ్స్ ఆసుపత్రి, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గురువారం శ్రీ మేధా డిగ్రీ కళాశాల సభాభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా -
ముంపు గాయానికి మందు
[ 10-05-2024]
రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లోతట్టు ప్రదేశాలను ముంపు నుంచి సంరక్షించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె చేపట్టే పథకాలకు ప్రపంచ బ్యాంకు రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. -
సిట్ నిరుపయోగం: కుమార
[ 10-05-2024]
అశ్లీల వీడియోల పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆక్రోశించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!