‘సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం’
కాంగ్రెస్ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుందని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
మైసూరు సమీపంలోని బిలుగాలి వద్ద డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు స్వాగతం పలుకుతున్న అభిమానులు
మైసూరు, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుందని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. తమకు కనీసం 120-130 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. మైసూరులో బుధవారం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నంజనగూడు, బుధవారం వరుణకు వ్యక్తిగత పనులపై వెళ్లి వచ్చానని తెలిపారు. హెలికాఫ్టర్లో రోజుకు నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారాన్ని చేస్తానని చెప్పారు. ప్రజాధ్వని బస్సు యాత్రలో 60 నియోజకవర్గాలలో ప్రచారం పోటీ చేశానని గుర్తు చేశారు. డీకే శివకుమార్ అన్ని నియోజవకర్గాలలో ప్రచారాన్ని చేస్తున్నారని, ఆయన ప్రచారానికీ చక్కని స్పందన వస్తుందని తెలిపారు. కాంగ్రెస్కు తక్కువ సీట్లు వస్తే జనతాదళ్- భాజపా కలిసి పోయే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. వరుణ తాను పుట్టిన ప్రాoతమని గుర్తు చేశారు. తాలూకా బోర్డుకు 1978లో మొదటిసారి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచానని, 2008, 2013లో అక్కడ గెలిచానని తెలిపారు. గత ఎన్నికలలో అక్కడి నుంచి ఓడిపోయినా, ఈసారి ఘన విజయాన్ని సాధిస్తానని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం అనుమతిస్తే కోలారు నుంచీ పోటీ చేస్తానన్నారు. ఎన్నికలలో అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ నిఘాను మరింత తీవ్రం చేయాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వాళ్లే వస్తున్నారు
బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్టుడే: కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఇతర పార్టీల శాసనసభ్యులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించలేదని కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్ తెలిపారు. బుధవారం ఇక్కడ కాంగ్రెస్భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్ కేటాయింపు కష్టంగా మారిందన్నారు. అనేక మంది శాసనసభ్యులు ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, కాని వారికి టిక్కెట్ ఇస్తామనే హామీ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులను భాజపా చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారన్న విషయాన్ని భాజపా నేతలు ప్రధానంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మరిచిపోకూడదన్నారు. అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, భాజపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఏ ఆధారంగా రిజర్వేషన్లను వర్గీకరించారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానంలో నిలవబోవన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక