logo

పాక్‌ అనుకూల నినాదాలతో కలకలం

పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడనే ఆరోపణల నేపథ్యంలో మైకోలేఔట్‌ పోలీసులు పశ్చిమబెంగాల్‌కు చెందిన అంకుశ్‌ అనే యువకుడిని బంధించి విచారణ చేపట్టారు.

Published : 31 Mar 2023 02:54 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడనే ఆరోపణల నేపథ్యంలో మైకోలేఔట్‌ పోలీసులు పశ్చిమబెంగాల్‌కు చెందిన అంకుశ్‌ అనే యువకుడిని బంధించి విచారణ చేపట్టారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసి ఉద్యోగ నిమిత్తం ఆ యువకుడు నగరానికి వచ్చాడు. బీటీఎం లేఔట్‌ రెండో స్టేజిలో ప్రైవేట్‌ వసతి గృహంలో ఉంటున్నాడు. బుధవారం ఓ టీవీ సీరియల్‌ చూశాక.. బీటీఎం లేఔట్‌ రెండో స్టేజి రహదారిలో నిలబడి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడంటూ కొందరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని