అనుబంధాలే ఆలంబన
రాజకీయాల్లో అందరి మన్ననలూ పొందుతూ సుధీర్ఘకాలం రాణించటం అంతసులువు కాదు. అలాంటిది అందర్నీ కలుపుకొని తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బోసురాజు.
అమాత్యగిరిపై బోసురాజు
చందనసీమలో తెలుగు వెలుగు!
ఎన్ఎస్ బోసురాజు
మాన్వి, న్యూస్టుడే : రాజకీయాల్లో అందరి మన్ననలూ పొందుతూ సుధీర్ఘకాలం రాణించటం అంతసులువు కాదు. అలాంటిది అందర్నీ కలుపుకొని తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బోసురాజు. తెలుగు మూలాలున్న ఆయన కన్నడ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. మాన్వి కేంద్రంగా రోజు వారి దినచర్యను కోడికూత వినపడకముందే ప్రారంభించి అర్ధరాత్రి వరకు ప్రజా క్షేత్రంలోనే గడపటం రాజుకు అలవాటు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చెప్పినా దాన్ని కచ్చితంగా అమలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జాతీయ స్థాయి నాయకుల వద్ద పేరు గడించారు. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి.. తాజాగా మంత్రి పదవి దక్కించుకునే దాకా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. రాయచూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాదులు వేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మాజీ ఎంపీ దివంగత నాయకురాలు బసవరాజేశ్వరి, హెచ్.జి.రాములుని బోసురాజుకి రాజకీయ గురువులుగా చెబుతారు.
* ఎన్నికల సమయంలో పలు జిల్లాలకు కీలక బాధ్యతలు చేపట్టారు. నీటి పారుదల వ్యవస్థపై ఆయనకు అపార అనుభవముంది. ఫలితంగా రెండు సార్లు ‘కాడా’ అధ్యక్షుడయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప చొరవతో గణేకల్ రిజర్వాయర్ మంజూరు చేయగా దాని నిర్మాణ బాధ్యతలను పూర్తిగా తన అనుభవంతోనే ఇంజినీర్లతో నిమిత్తం లేకుండా పూర్తి చేయడం గమనార్హం.
* రాయచూరు జిల్లా మాన్వి నియోజకవర్గం నుంచి 1985లో జరిగిన ఎన్నికల్లో బసవరాజ్ పాటిల్ అన్వరి చేతుల్లో ఓటమి పాలయ్యారు. దీన్ని సవాల్గా తీసుకున్న బోసురాజు రాజకీయంగా వ్యూహాలకు పదునుపెట్టారు. తనదంటూ ఓ బృందాన్ని ఏర్పరుచుకున్నారు. 1999, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు విజయం సాధించి నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు. తర్వాత రాజకీయంగా రాజు వెనక్కితిరిగి చూడలేదు. కల్యాణ కర్ణాటక ప్రాంతంలో భారత్ జోడో యాత్ర పూర్తి బాధ్యతలను బోసురాజే తీసుకుని విజయవంతం చేశారు. ఈక్రమంలో ఆయన పనితీరును అధినాయకుడు రాహుల్గాంధీ మెచ్చుకుని సహకారం అందించారు. మొన్నటి ఎన్నికల్లో బోసురాజు రాయచూరు నుంచి పోటీ చేయాలని మునిగాళ్లపై నిలిచారు. అక్కడ మైనార్టీల ప్రాబల్యాన్ని గుర్తించి అధిష్ఠానం వెనక్కి తగ్గమనడంతో రాజు తలవంచారు. పీసీసీ సూచించిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీలో ఆయనకు అన్ని స్థాయిల్లోనూ చక్కని సంబంధాలున్నాయి. అవి ఇప్పుడు బోసురాజు మంత్రి కావటానికి తోడ్పడ్డాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ ‘మహాసంగ్రామం’
[ 06-05-2024]
అభ్యర్థుల తరఫున మలివిడత ప్రచారాన్ని ముగించిన పార్టీలు.. ఇక ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. -
భాజపా నేతలవి పగటికలలు
[ 06-05-2024]
కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి లోక్సభ ఎన్నికలు రెండో స్వాతంత్య్ర పోరాటంతో సమానమని అభివర్ణించారు. -
జనతాదళంలో నిర్వేద పర్వం
[ 06-05-2024]
కీలక నేత హెచ్.డి.రేవణ్ణ అరెస్టుతో జనతాదళ్(ఎస్) శ్రేణుల్లో నిస్తేజం ఆవహించింది. ఓ వైపు అగ్రనేత హెచ్.డి.దేవేగౌడను అనారోగ్యం వెన్నాడుతోంది. -
దారితప్పిన కరవు పరిహారం: అశోక్
[ 06-05-2024]
కేంద్రం విడుదల చేసిన కరవు పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయకుండా అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నట్లు భాజపా ఆరోపించింది. -
నేతల ప్రచారానికి తాళం..ఓటరు చేతికి పాశుపతాస్త్రం
[ 06-05-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. అసలైన ఘట్టమైన పోలింగ్కు ఓటరు దేవుడు తన పాశుపతాస్త్రంతో సిద్ధమవుతున్నాడు. -
‘జనార్దన్రెడ్డి ఏకవచనంతో మాట్లాడితే ఊరుకోం’
[ 06-05-2024]
గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్రెడ్డి తమను ఏకవచనంలో సంబోధించడం మానుకోవాలని మంత్రి శివరాజ్ తంగడిగి హెచ్చరించారు. -
చెంప చెళ్లుమనిపించిన డీకే
[ 06-05-2024]
హుబ్బళ్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు. -
ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపం
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపానికి పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఎం.ఎస్.దివాకర్ ఆదేశాలు జారీ చేశారు. -
డీకేను కించపరచిన ముగ్గురిపై కేసు
[ 06-05-2024]
పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కించపరిచేలా వివిధ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులపై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా