logo

‘మచ్చలేని నాయకుడు గిరిప్రసాద్‌’

సమకాలిన రాజకీయాల్లో మచ్చ లేని నాయకునిగా సీపీఐ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ నల్లమల గిరిప్రసాద్‌ పేరొందారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌

Published : 25 May 2022 01:44 IST

గిరిప్రసాద్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ నాయకులు

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: సమకాలిన రాజకీయాల్లో మచ్చ లేని నాయకునిగా సీపీఐ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ నల్లమల గిరిప్రసాద్‌ పేరొందారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ అన్నారు. గిరిప్రసాద్‌ వర్థంతిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని పాత బస్టాండు సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఎస్‌కె.జానిమియా అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ప్రసాద్‌ మాట్లాడారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిన మహోన్నత వ్యక్తిగా గిరిప్రసాద్‌ నిలిచారని కొనియాడారు. సాయుధ తెలంగాణ పోరాటంలో దళిత నేతగా కీలక భూమిక పోషించారని, పాల్వంచ గిరిజన ప్రాంతంలో వందలాది గ్రామాలను విముక్తి చేశారని తెలిపారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే గిరిప్రసాద్‌కు ఇచ్చే నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లమల చక్రవర్తి, జమ్ముల జితేందర్‌రెడ్డి, నర్సింహారావు, బీజీ.క్లెమెంట్‌, కళావతి, మహ్మద్‌ సలాం, సీతామహాలక్ష్మీ, వెంకటేశ్వరరావు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని