కరకట్ట.. కష్టాలకు అడ్డుకట్ట
సీఎం ప్రకటన నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇంజినీరింగ్ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సర్వే చేస్తున్నారు. పరివాహకంలో ఎక్కడెక్కడ ముంపు సమస్యలున్నాయి. ఏ మేరకు కరకట్టల నిర్మాణం చేపట్టాలి
సీతమ్మ సాగర్ ఎగువన కొనసాగుతున్న నిర్మాణం
దుమ్ముగూడెం మండలంలో చురుగ్గా సాగుతున్న పనులు
‘వరద ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలే చేపట్టాయి. భద్రాద్రి రామాలయం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు నిర్మాణానికి, ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి రూ.వేయి కోట్లు కేటాయిస్తాం.’
-భద్రాచలం ఇటీవల సీఎం కేసీఆర్ అన్న మాటలు ఇవి.
సీఎం ప్రకటన నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇంజినీరింగ్ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సర్వే చేస్తున్నారు. పరివాహకంలో ఎక్కడెక్కడ ముంపు సమస్యలున్నాయి. ఏ మేరకు కరకట్టల నిర్మాణం చేపట్టాలి అనే విషయమై పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో సర్వే పనులకు కొంత ఆటంకం కలుగుతోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ ప్రక్రియ వేగంగా కొనసాగే అవకాశాలున్నాయి.
-అశ్వాపురం, న్యూస్టుడే
సీతమ్మ సాగర్కు ఎగువ..
దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. 37 టీఎంసీల నీటి నిల్వ లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీంతో ఎగువన ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. జలవనరుల శాఖ అధికారులు సీతమ్మ సాగర్కు అనుబంధంగా గోదావరికి ఎడమ, కుడి వైపు 70 మీటర్ల ఎత్తుతో రూ.1,500 కోట్లతో కరకట్ట నిర్మిస్తున్నారు. ఎడమ వైపు దుమ్ముగూడెం మండలం నుంచి చర్ల మండలం వరకు 67 కి.మీ, కుడి వైపు అశ్వాపురం మండలం నుంచి పినపాక మండలం వరకు 57 కి.మీ పొడవునా దీనిని నిర్మిస్తున్నారు. అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ప్రధాన వాగులకూ..
గోదావరి అనుబంధ ప్రధాన వాగులకు కూడా కరకట్ట విస్తరించనున్నారు. ఎడమ అయిదు, కుడి వైపు అయిదు ప్రధాన వాగులను అధికారులు గుర్తించారు. 1986 వరదలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ ఏడాది గోదావరికి వరదలు 76 అడుగులు వచ్చాయి. ఆ వరదల ప్రాతిపదికగా ముంపు ప్రాంతాల వరకు ప్రధాన వాగులకు కరకట్టలు నిర్మించనున్నారు. వీటిని కలుపుతూ నదికి రెండువైపులా ఉన్న కరకట్టల దిగువన ప్రత్యేక కాలువలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలువల ద్వారా ఆ వాగుల ప్రవాహాలను మరలించి సీతమ్మ సాగర్కు దిగువన గోదావరిలోకి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్ని సర్వేలు నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం అవి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి.
ఇప్పుడు సమస్య ఇక్కడే..
ముంపు సమస్య, కరకట్టల నిర్మాణం అవసరం ఉన్నది సీతమ్మ సాగర్ దిగువ భాగంలోనే. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి నుంచి బూర్గంపాడు 25 కి.మీ, దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వరకు 30 కి.మీ పరీవాహక గ్రామాలకు ముంపు సమస్య ఏర్పడుతోంది. అయితే అంత పొడవున కరకట్టల నిర్మాణం అవసరం లేదనేది జలవనరులశాఖ అధికారుల అభిప్రాయం. ఎక్కడ ఏ మేరకు అవసరమో అక్కడి వరకే నిర్మాణం చేపడితే మేలనేది వారి సూచన. ఈ మేరకే అధికారులు ప్రస్తుతం సర్వేలు కొనసాగిస్తున్నారు.
గతంలో కూడా..
కరకట్టల నిర్మాణం కోసం సర్వేలు కొత్తేమీ కాదు. 1999లో తెదేపా హయాంలో గోదావరికి ఇరువైపులా కరకట్ట నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు వాటి కోసం సర్వేలు కూడా జరిగాయి. గోదావరికి కుడి వైపు అశ్వాపురం మండలం నెల్లిపాక నుంచి బూర్గంపాడు వరకు, ఎడమ వైపు దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వరకు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందినా తర్వాత మూలనపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!