అక్షరానికి అగ్రాసనం
చదువు తరగని ఆస్తి.. ఇదే అక్షర సత్యమని భావించిన ప్రభుత్వాలు విద్యకు అగ్రాసనం వేశాయి. అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేటు దీటుగా తీర్చిదిద్దారు. పథకాలను అందిపుచ్చుకున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు దేశ, విదేశాల్లో
ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి
‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏర్పడేనాటికి జిల్లాలో చాలా తక్కువ సంఖ్యలోనే ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి. నగరంలోని ఖాజీపుర, రిక్కాబజారు, నయాబజారు, ప్రభుత్వ బాలికల పాఠశాల ఉండేవి. 1973-74 రాజ్యంగ సవరణ చట్టం ద్వారా విద్య పంచాయతీరాజ్ వ్యవస్థ పరిధిలోకి రావటంతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు ఏర్పాటయ్యాయి. దీంతో ప్రజలకు విద్య చేరువైంది.’’
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే : ప్రధానంగా డీపీఈపీ(డిపెప్) పథకంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వేల సంఖ్యలో పాఠశాల భవనాలు ఏర్పడ్డాయి. సర్వశిక్షా అభియాన్ పథకంలో ఉన్నత పాఠశాలల భవనాలు నిర్మించారు. ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున వంటగదులు, శౌచాలయాలు, తాగునీటి పథకాలు, ఇతర మౌలిక వసతుల కల్పన జరిగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు- మనబడి’, ‘మన ఊరు-మన బస్తీ’ పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మైలురాళ్లు
ఖమ్మంలో ఐటీ రంగం విస్తరిస్తోంది. పెద్ద నగరాలకే పరిమితమైన ఐటీహబ్ ఇక్కడ ఏర్పడింది. రెండోది కూడా నిర్మాణం కానుంది. మరోవైపు జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష వైద్యవిద్య కళాశాల ఏర్పాటు.. ఇటీవల అదికూడా మంజూరైంది. ఏళ్ల నాటి కల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఇక్కడి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది.
విద్యార్థులను ఆకర్షించే పథకాలు
మధ్యాహ్న భోజన పథకం అమలు, సన్న బియ్యం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా ఛార్జీల చెల్లింపు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందించటం లాంటి పథకాలతో సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించారు. 1986లో జాతీయ విద్యా విధానం, 2009లో విద్యాహక్కు చట్టం, 2020లో నూతన విద్యావిధానం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు.
ప్రతిభాశీలురకు ఆలంబన.. నవోదయ, కేంద్రియ విద్యాలయాలు
గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, 2005 నుంచి అమల్లోకి వచ్చిన ట్రిపుల్ ఐటీలు పేద విద్యార్థుల దిశనే మార్చేశాయి. ప్రతిభ కలిగిన అనేక మంది విద్యార్థులకు ఇవి ఆలంబనగా మారాయి. సక్సెస్ పాఠశాలల ఏర్పాటు వల్ల పెద్ద ఎత్తున ఆంగ్లం, భౌతికశాస్త్రం ఉపాధ్యాయుల నియామకం జరిగింది. గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి వచ్చింది. గురుకుల విద్యావ్యవస్థ విప్లవాత్మక మార్పుగా భావించవచ్ఛు విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది.
బాలికా విద్యపై ప్రత్యేక శ్రద్ధ
కస్తూర్బా బాలికలవిద్యాలయాల్లో తల్లిదండ్రులులేని అనాథ బాలికలు, బాలకార్మికులు, చదువుమానేసి కూలీ పనులు చేసేవారికి ఉచితవసతి సౌకర్యాలతో పాటు ఉచితభోజనం, దుస్తులు అందిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో మొత్తం 28 కేజీబీవీల్లో 8వేల మందికి పైగా బాలికలు చదువుకుంటున్నారు. పది, ఇంటర్, ఇతర ప్రతిష్ఠాత్మక ప్రవేశపరీక్షల్లో పైచేయి సాధిస్తున్నారు.
నాడు గ్రామాల్లోనే ఉపాధ్యాయులు నివాసం ఉండి విద్యాబోధన చేసే వారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహకారంతో పాఠశాలలు కళకళలాడాయి. సమితి అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్న కాలంలో విద్యపై పరిరక్షణ ఉండేది. -గోళ్లముడి మల్లిఖార్జునశర్మ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ఖమ్మం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!