అ.ని.శా.కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఖ
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఖమ్మం గ్రామీణ మండలం ఏదులాపురం పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కూసుమంచి మండలం నాయకన్గూడెం గ్రామానికి చెందిన దేశబోయిన నాగేశ్వరరావు ఖమ్మం గ్రామీణ మండలం ఏదులాపురం పంచాయతీలోని చంద్రానగర్కాలనీలో 126 గజాల స్థలం కొనుగోలు చేసి అందులో ఇంటి నిర్మాణం చేశాడు. ఆ ఇంటిని విక్రయించేందుకు ప్రయత్నం చేశాడు. ఇంటి నంబర్ ఉంటే కొనుగోలు చేసే వారికి మంచిదని ఇంటి నంబర్ కోసం ఏదులాపురం పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషాని ఆశ్రయించాడు. దీనికి పంచాయతీ కార్యదర్శి పాషా రూ.20 వేలు ఇస్తేనే ఇంటి నంబర్ కేటాయిస్తామని చెప్పారు. చివరికి రూ.6 వేలు ఇస్తే ఇంటినంబర్ ఇస్తామని చెప్పడంతో నాగేశ్వరరావు లంచం ఇవ్వడానికి సిద్ధమై 10 రోజుల క్రితమే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మంగళవారం ఏదులాపురం పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి పాషాకి రూ.6 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతోపాటు పాషా ఇంటి వద్ద కూడా తనిఖీలు చేసి, అక్రమ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించనున్నారు. పాషాని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
మృతదేహం లభ్యం: మణుగూరు పట్టణం, న్యూస్టుడే: పట్టణంలోని మల్లేపల్లి వద్ద గోదావరిలో గల్లంతైన శ్రీనివాసరావు(40) మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి గోదావరికి వెళ్లిన సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామానికి చెందిన శ్రీనివాసరావు వరద ప్రవాహానికి కొట్టుకపోయాడు. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం అతని మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత