స్వచ్ఛ సర్వేక్షణ్లో ఖమ్మానికి తొలిస్థానం
‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’లో 2023 జనవరి మాసానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చిన సూచీలో ఖమ్మం జిల్లా త్రీస్టార్ కేటగిరీలో దేశంలోనే తొలిస్థానం సాధించింది.
ఖమ్మం రోటరీనగర్, న్యూస్టుడే
స్వచ్ఛ భారత్ మిషన్ ప్రచార రథం
‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’లో 2023 జనవరి మాసానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చిన సూచీలో ఖమ్మం జిల్లా త్రీస్టార్ కేటగిరీలో దేశంలోనే తొలిస్థానం సాధించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఈ పథకం ద్వారా ఏటా అవార్డులు అందిస్తోంది. ఈ ఏడాది కేటగిరీల ఎంపికలో మార్పులు తీసుకొచ్చింది. 2023కు సంబంధించి ఇప్పటి వరకు ప్రతినెలా గుర్తింపు ప్రక్రియను చేపట్టింది. దీనిలో భాగంగా జనవరి 2023లో బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలన(ఓడీఎఫ్) ప్లస్ కేటగిరీలో 83.09 స్కోరుతో ఖమ్మం జిల్లా ప్రధమ స్థానంలో నిలిచినట్లు తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గృహాల్లో, సంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించడం, గ్రామాల్లో ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, కంపోస్టు షెడ్ల నిర్మాణం, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతోపాటు వాల్ పెయింటింగ్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. జనవరిలో జరిగిన సర్వే ప్రకారం ఖమ్మం జిల్లా మొత్తంగా 187.34 స్కోర్తో తొలిస్థానంలో నిలిచింది. జనవరిలో 83.09 స్కోర్ సాధించడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి జిల్లా ఫోర్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది. 75 స్కోర్ పైబడి సాధించే జిల్లాలకు నాలుగు నక్షత్రాల రేటింగ్ ఇస్తారు.
* జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి, ఇతర కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్, డీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలవడం గర్వకారణం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాల్సి ఉంది. జిల్లా, గ్రామ, మండల స్థాయిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ఈ విజయం సాధ్యమైంది.
ఎం.విద్యాచందన, డీఆర్డీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!