డ్రాగన్ పండు.. లాభాలు మెండు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన పండుకు స్థానికంగానే మార్కెట్ ఉంది. రైతుల పొలాల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్యంపై అవగాహన పెరగటంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఖరీదైన ఈ పండు ఇప్పుడు సూపర్ మార్కెట్లు, మాల్స్, వీధుల వెంట కూడా లభిస్తోంది.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో..
ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు మండలాల్లో నామమాత్రంగా ఉన్న సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, ఖమ్మం గ్రామీణం, కూసుమంచి, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కామేపల్లి, వేంసూరు, బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, పినపాక, సుజాతనగర్, దుమ్ముగూడెం, కరకగూడెం మండలాల్లో సుమారు 40 ఎకరాల్లో పండిస్తున్నారు.
30 ఏళ్ల పాటు ఆదాయం
డ్రాగన్ ఫ్రూట్ తక్కువ నీటి సౌలభ్యం ఉన్న నేలల్లో కూడా పండించవచ్చు. ఎకరానికి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇలా 30 సంవత్సరాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.200 నుంచి రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ పండులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విటమిన్-సి, ఖనిజ లవణాలు, పీచు పదార్థం, పాస్పరస్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెంచటంతో గుండె, ఎముకలు, వెంట్రుకలు, చర్మ సౌందర్యానికి మంచిదంటున్నారు. వైన్, సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
ఇక్కడ అనుకూల పరిస్థితులు...
- బీవీ రమణ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి, ఖమ్మం
డ్రాగన్ పండు సాగుకు జిల్లాలో అనుకూల పరిస్థితులున్నాయి. ఇప్పుడిప్పుడే రైతులకు అవగాహన పెరిగింది. పలు మండలాల్లో సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు తమ అధికారులు అందుబాటులో ఉన్నారు.సద్వినియోగం చేసుకోవాలి.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సాగు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన ఏలూరి శివశంకర్ బీటెక్ చదివి హైదరాబాద్లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో తన పొలంలో డ్రాగన్ ఫ్రూట్ వేయాలని భావించారు. వెంటనే మూడెకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. మొదటి రెండేళ్లు నామమాత్రంగా ఆదాయం వచ్చినా మూడో సంవత్సరం నుంచి ఎకరానికి 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తోంది. కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పొలం వద్దనే విక్రయిస్తున్నారు. ఈ లెక్కన సగటున ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు ఆదాయం వస్తోందని ‘న్యూస్టుడే’కు చెప్పారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM