‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు.
నంబరు ప్లేటు లేని వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిస్తున్న ఏసీపీ శ్రీనివాసులు (పాత చిత్రం)
బిస్కెట్లు కావాలంటూ ఖమ్మంలోని మామిళ్లగూడెంలో ఓ దుకాణంలోకి నాలుగు రోజుల క్రితం ఓవ్యక్తి వచ్చి నిర్వాహకురాలి మెడలోంచి ఆరు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. నంబరు ప్లేటు లేని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
నంబర్ ప్లేటు లేకుండా కొందరు.. నంబర్లోని అక్షరాలను చెరిపి ఇంకొందరు.. నంబర్ ప్లేటును వంచి మరికొందరు ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు. గతంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించటంతో ఈ జాడ్యం వేలాది మంది వాహనదారులకు పాకింది.
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. తద్వారా తాము ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. అతివేగంగా పరుగులు తీసే వీరి వాహనాలకు నంబరు ప్లేట్లు కనిపించటం లేదు.
శాశ్వత రిజిస్ట్రేషన్ లేకుండానే..
కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్రవాహనానికి షోరూంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. తదుపరి సదరు యజమాని తన వాహనానికి జిల్లా రవాణా శాఖ వద్ద శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ అనేక మంది ద్విచక్రవాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించు కోకుండా తిరుగుతున్నారు.
ఖమ్మం నగరంలో ప్రత్యేక తనిఖీలు
ఇలాంటి వాహనాల కారణంగా ప్రమాదాలు, దొంగతనాలు వంటి ఘటనల్లో నేరపరిశోధన పోలీసులకు సవాల్గా మారుతోంది. ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించటంతో ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది మార్చి 1 నుంచి ఖమ్మం నగరంలో ‘స్పెషల్ డ్రైవ్’ చేపట్టారు. జడ్పీ సెంటర్, పాత బస్టాండ్, ఇల్లెందు క్రాస్రోడ్డు వంటి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నంబరు ప్లేటు లేని వాహనాలను స్వాధీనపరచుకుంటున్నారు. జరిమానా విధించటంతోపాటు వాహనానికి నంబరు ప్లేటు బిగించేలా చేస్తున్నారు. నంబరు ప్లేటు లేకుండా, మార్ఫింగ్ చేసి మరోమారు పట్టుబడితే మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపిస్తున్నారు. ఇల్లెందు రోడ్డు, శ్రీశ్రీ సర్కిల్, గాంధీచౌక్, కాల్వొడ్డు, ప్రకాశ్నగర్, ముస్తఫా నగర్, బోనకల్లు రోడ్డు వంటి రద్దీ మార్గాల్లోనూ తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఖమ్మం నగరంలోని కూడళ్లలో నిత్యం తనిఖీలు చేపడుతున్నాం. నంబరు ప్లేటు లేకుండా, ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి తిరుగుతున్న వాహనదారులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. కేసులు నమోదైతే కోర్టు వాయిదాలకు తిరగాల్సి ఉంటుంది. యువత విదేశాలకు వెళ్లాలంటే ఈ కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. వాహనదారులు మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించాలి.
బి.శ్రీనివాసులు, ట్రాఫిక్ ఏసీపీ, ఖమ్మం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక