వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది.
పాల్వంచ, న్యూస్టుడే: సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య దిశగా అడుగులు వేసేందుకు పాలి‘టెక్నిక్’ వైపు మళ్లుతుండటం విశేషం.
పదో తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేస్తే మూణ్నాలుగేళ్లలో, మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాల్లోనూ నేడు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎంచుకున్న విభాగం ఆధారంగా ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతిభావంతులైతే కొలువు సాధనకు పెద్దగా సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలో నీటిపారుదల, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్, రోడ్లు, భవనాల శాఖ, టీఎస్ ఆర్టీసీ, టీఎస్ జెన్కో తదితర సంస్థల్లో నైపుణ్య కొలువులు ఎక్కువగా భర్తీ చేస్తుంటారు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు సూపర్వైజర్ స్థాయి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. వీటిల్లో ప్రాంగణ నియామకాలతో భర్తీ అయ్యే పోస్టులు ఎక్కువ. మంచి మార్కులు, కావాల్సిన అదనపు వృత్తి నైపుణ్యాలు సాధిస్తే నెలకు రూ.లక్షల్లో వేతనం పొందవచ్చు. కోర్సు పూర్తిచేసిన వారు బీటెక్లో రెండో సంవత్సరంలోనూ ప్రవేశం పొందే వీలుంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చదువుకునే వారికి సింగరేణి భర్తీ చేస్తే పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. పాలిటెక్నిక్ చదివిన వారికి మరిన్ని ఉద్యోగావకాశాలు దక్కే వీలుంది. ఇటీవల కూడా వందల ఉద్యోగాల భర్తీకి ఆ సంస్థ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇలాంటి ప్రయోజనాలున్న పాలిటెక్నిక్లో చేరేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22వ తేదీతో ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలి.
పరీక్షలు ఇలా
- ప్రశ్నపత్రం: తొమ్మిది, పదో తరగతి పాఠ్యాంశాల ఆధారంగా 150 మార్కులతో ప్రశ్నపత్రం రూపొందిస్తారు. దీంట్లో గణితం 60, భౌతికశాస్త్రం 30, బయాలజీ 30, రసాయన శాస్త్రానికి 30 మార్కులు ఉంటాయి. సమయం 2 గంటలు.
- కళాశాలలు: మధిర, కొత్తగూడెం, మణుగూరులో ప్రభుత్వ కళాశాలలున్నాయి. వీటిల్లో 8 కోర్సుల్లో 780 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని మరో 9 ప్రైవేటు కళాశాలల్లో ఉన్న సీట్లు.. 1980.
- ఫీజులు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి. ఈ నెల 24వ తేదీ వరకు రూ.100తో, ఈ నెల 26న తత్కాల్లో రూ.300 అపరాధ రుసుంతో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
- పరీక్ష: 2024, మే 24న
- ఫలితాలు: పరీక్ష రాసిన 12 రోజుల తర్వాత వెల్లడి
ఉపాధి, ఉన్నత విద్య అవకాశాలు
- నాగమునినాయక్, ‘పాలిసెట్’ జిల్లా కోఆర్డినేటర్, భద్రాద్రి
‘పాలిటెక్నిక్’ డిప్లొమా ఉత్తీర్ణుల్లో వంద శాతం మందికి ఉద్యోగావకాశాలున్నాయి. వృత్తివిద్యలో మంచి నైపుణ్యాలున్న వారెందరో దేశ, విదేశాల్లో ఉన్నతస్థాయి వేతనాలుగల ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాంచీల్లో చేరేవారు, చదువుతో పాటు ఏకకాలంలో కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకోవాలి. నేడు ఎన్నో ఆన్లైన్ వేదికలు స్కిల్స్ నేర్పిస్తున్నాయి. వీటన్నింటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ మార్కులు సాధిస్తే ప్రాంగణ నియామకాల్లో మంచి ప్రైవేటు కొలువులు సాధించడం సులువు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు మండలం పోచారం తండా, మాణిక్యారం గ్రామాల్లో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ కరుణాకర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
[ 02-05-2024]
సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ కూతురు ఆశ్రిత బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓట్లు భద్రం.. తీర్పు సుస్పష్టం..!
[ 02-05-2024]
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
భగభగలు
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఖమ్మం జిల్లా బుధవారం నిప్పులగుండంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
పోలింగ్ సమయంలో అప్రమత్తత అవసరం: కలెక్టర్
[ 02-05-2024]
పోలింగ్ సమయంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. -
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: పొంగులేటి
[ 02-05-2024]
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు -
ఈసారీ అధిక మెజార్టీ ఇవ్వండి: నామా
[ 02-05-2024]
గత లోక్సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
అభ్యర్థుల్లో వాటా 3 శాతమే
[ 02-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు. -
మేడే వద్దన్న మోదీని వదిలించుకుందాం: తమ్మినేని
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. -
రాములోరికి ఘనంగా తిరుమంజనం
[ 02-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం తిరుమంజనం పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ తిరుమంజనం కొనసాగించారు -
స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలి: ఎస్పీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసులు కృషిచేయాలని ఎస్పీ బి.రోహిత్రాజు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..