దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎంపిక
బి.శ్రీశైలం, బూరం మౌనిక, వీసం హరిప్రియ
అశ్వారావుపేట, న్యూస్టుడే: దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు దేశంలో నలుమూలలా వ్యవసాయ శాస్త్రవేత్తలుగా, ఉన్నతాధికారులుగా, పలు రకాలుగా సేవలందిస్తూ సత్తా చాటుతున్నారు. ఐసీఏఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్) ఆధ్వర్యంలో ఏఎస్ఆర్బీ (అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంటు బోర్డు) ద్వారా జరిగిన పోటీల ఫలితాల్లో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. వారిలో బత్తుల శ్రీశైలం, వీసం హరిప్రియ, బూరం మౌనిక వ్యవసాయ విస్తరణ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తలుగా నియమితులయ్యారు.
- ఐసీఏఆర్ ఆధ్వర్యంలో గత ఏడాది మార్చి 14న పరీక్షలు నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 29వరకూ జరిగిన ముఖాముఖిలు నిర్వహించారు. ఆ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2014-18 వరకూ బత్తుల శ్రీశైలం, 2016-20 వరకూ బూరం మౌనిక, 2017-21 వరకూ వీసం హరిప్రియ అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తుండగా తాజా ఎంపికలో అరుణాచల్ప్రదేశ్లోని లాంగ్డింగ్ కృషి విజ్ఞాన కేంద్రానికి శాస్త్రవేత్తగా నియమితులయ్యాడు. ఎన్డీఆర్ఐ కర్నాల్(హరియాణా)లో పీహెచ్డీ పూర్తి చేసిన మౌనిక సంత్పూర్ (కటక్) ఎన్ఆర్ఆర్ఐ కేంద్రానికి, పీహెచ్డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హరిప్రియ పశ్చిమబంగాలోని నదియా జిల్లాలోని కల్యాణికి నియమితులయ్యారు. ముగ్గురూ వ్యవసాయ విస్తరణ విభాగంలో శాస్త్రవేత్తలుగా ఎంపిక కావడం విశేషం. మొత్తం మీద ఏటా వివిధ విభాగాల్లో ముందుంటున్న అశ్వారావుపేట విద్యార్థులు తాజాగా మరోసారి సత్తా చాటడం పట్ల స్థానిక వ్యవసాయ కళాశాల ఏడీ హేమంత్కుమార్, ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కార్యకర్తలూ శక్తిమంతులే..
[ 05-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు. -
ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత ఎన్టీఆర్దే: నామా
[ 05-05-2024]
నాడు కాంగ్రెస్ పాలనలో ఆకలి చావులు ఉండేవని, వాటిని అరికట్టేందుకు అన్న ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాతోనే సుస్థిర పాలన: తాండ్ర
[ 05-05-2024]
భాజపాతోనే సుస్థిర పాలన సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. సత్తుపల్లి, మధిరలో శనివారం నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. -
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 05-05-2024]
ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ జి.కోల్టేతో కలిసి కలెక్టరేట్లో ఆన్లైన్లో ఈ ప్రక్రియను శనివారం నిర్వహించారు. -
ఉపాధి కూలీలకు భానుడి సెగ
[ 05-05-2024]
భానుడి భగభగతో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశాల్లో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. పనిచేసే చోట ఎలాంటి నీడ, కనీస వసతులు లేక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు. -
మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
[ 05-05-2024]
రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు హడావుడి చేసి 236 కొనుగోలు కేంద్రాలు తెరచి నెల రోజులు దాటిపోయింది. ఇందులో కేవలం 70 కొనుగోలు కేంద్రాల్లో 8,760 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. -
గెలిచే వరకు.. ఆపకు పరుగు
[ 05-05-2024]
‘జీవితమంతా ఉరుకులు పరుగులు’ అన్నది నానుడి. మాట వరుసకు కాకుండా నిజంగా ఓ లక్ష్యం కోసం పరుగునే ఆయుధంగా మలుచుకున్న వారి శ్రమ వృథా కాలేదు. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది డిగ్రీ కోర్సులనే ప్రధానంగా ఎంపిక చేసుకుంటారు. -
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా 44 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
1,105 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు: కలెక్టర్
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల కోసం జిల్లాలో 1,105 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు