భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు.
భద్రాచలం, న్యూస్టుడే: ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. భద్రాచలం ఎంపీగా కర్రెద్దుల కమలకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి 1989లో నెగ్గారు. 1991 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలవడంతో గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు సహాయ మంత్రి పదవి పొందారు. భద్రాచలం నుంచి గెలిచిన ఆమెను అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రోత్సహించడంతో మన్యం ప్రజల అభ్యున్నతికి కృషి చేశారు. విద్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా చైనా, అమెరికా వంటి దేశాల్లో పర్యటించి విదేశీ వ్యవహారాలలో ప్రభుత్వానికి సహకరించారు. అప్పట్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసే కమిటీలో కీలకపాత్ర పోషించారు. షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ సభ్యురాలిగా పని చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆమె స్వగ్రామం. బీఈడీ చేసిన ఆమె జంగారెడ్డిగూడెంలో వసతిగృహ సంక్షేమ అధికారిగా పని చేస్తుండగా రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్లో చేరి పార్లమెంట్కు వెళ్లారు. 1996, 1998లో ఎంపీగా పోటీ చేసినప్పటికీ నెగ్గలేదు.
తెదేపా ఎంపీగా విజయకుమారి..
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం లోక్సభ స్థానంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు జెండా ఎగురవేయగా ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ విజయాన్ని దక్కించుకోవడం విశేషం. విద్యావంతురాలైన దుంపా మేరీ విజయకుమారిని ఓటర్లు అందలమెక్కించారు. 1999లో ఆసక్తికర పోటీ నెలకొంది. టి.రత్నాబాయి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయగా ఆమెపై తెదేపా అభ్యర్థి దుంపా మేరీ విజయకుమారి 37,103 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఆమెది విశాఖ జిల్లాలోని సరుగుడు గ్రామం. ప్రభుత్వ పాలనా శాస్త్రంలో పీజీ చేశారు. ఆ రోజుల్లోనే పర్యాటక రంగానికి భవిష్యత్తు ఉంటుందని భావించి ఆ రంగం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కార్యకర్తలూ శక్తిమంతులే..
[ 05-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు. -
ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత ఎన్టీఆర్దే: నామా
[ 05-05-2024]
నాడు కాంగ్రెస్ పాలనలో ఆకలి చావులు ఉండేవని, వాటిని అరికట్టేందుకు అన్న ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాతోనే సుస్థిర పాలన: తాండ్ర
[ 05-05-2024]
భాజపాతోనే సుస్థిర పాలన సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. సత్తుపల్లి, మధిరలో శనివారం నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. -
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 05-05-2024]
ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ జి.కోల్టేతో కలిసి కలెక్టరేట్లో ఆన్లైన్లో ఈ ప్రక్రియను శనివారం నిర్వహించారు. -
ఉపాధి కూలీలకు భానుడి సెగ
[ 05-05-2024]
భానుడి భగభగతో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశాల్లో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. పనిచేసే చోట ఎలాంటి నీడ, కనీస వసతులు లేక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు. -
మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
[ 05-05-2024]
రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు హడావుడి చేసి 236 కొనుగోలు కేంద్రాలు తెరచి నెల రోజులు దాటిపోయింది. ఇందులో కేవలం 70 కొనుగోలు కేంద్రాల్లో 8,760 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. -
గెలిచే వరకు.. ఆపకు పరుగు
[ 05-05-2024]
‘జీవితమంతా ఉరుకులు పరుగులు’ అన్నది నానుడి. మాట వరుసకు కాకుండా నిజంగా ఓ లక్ష్యం కోసం పరుగునే ఆయుధంగా మలుచుకున్న వారి శ్రమ వృథా కాలేదు. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది డిగ్రీ కోర్సులనే ప్రధానంగా ఎంపిక చేసుకుంటారు. -
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా 44 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
1,105 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు: కలెక్టర్
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల కోసం జిల్లాలో 1,105 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు