అందరికీ ఆరోగ్యం.. అదే లక్ష్యం
ప్రస్తుత సమాజంలో ఎవరికి వారు వివిధ రకాల ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతూ వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. దైనందిన జీవితంలో వ్యాయామం, యోగా, ధ్యానం
జాతీయ ఆరోగ్యమిషన్ అధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: ప్రస్తుత సమాజంలో ఎవరికి వారు వివిధ రకాల ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతూ వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. దైనందిన జీవితంలో వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివాటిని భాగస్వామ్యం చేసుకుని క్రమం తప్పకుండా ఆచరిస్తే చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చు. అందుకే జాతీయ ఆరోగ్యమిషన్ద్వారా వివిధ రకాల వ్యాయామాలపై అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగానే ఎరోబిక్స్, వివిధ రకాల వ్యాయామాలపై మిడ్లెవల్హెల్త్ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
ఏమి చేస్తారంటే..
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమల్లో భాగంగా నియమించిన ఎంఎల్హెచ్పీలు జిల్లా వైద్యఆరోగ్యశాఖ నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతోపాటు వారికి ప్రత్యేకంగా కేటాయించిన విధులు కూడా నిర్వహించాలి. ప్రధానంగా బీపీ, మధుమేహంతోపాటు కంటి సంబంధిత సమస్యలు వివిధ వ్యాధులు ఉన్నవారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. వారికి ప్రతి నెలా ఇచ్చే మందులు సక్రమంగా పంపిణీ చేయడంతోపాటు వాటిని ఈఔషధ పోర్టల్లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగుల సమస్య తెలుసుకుని సంబంధిత విభాగ వైద్యునితో టెలీకన్సల్టేషన్ ద్వారా సంప్రదించి వారి సూచన మేరకు సేవలు అందించడంతోపాటు మందులు పంపిణీ చేస్తారు. ఆరోగ్యకేంద్రానికి ఎంతమంది రోగులు వచ్చారు..ఎలాంటి అనారోగ్య సమస్యలు గుర్తించారు..ఎలాంటి సేవలు అందించారు..ఇలా అన్ని అంశాలను రోజువారీగా సంబంధిత యాప్లలో నమోదు చేయాలి. గర్భిణులకు నిర్వహించే పరీక్షలు, అందించే పౌష్టికాహారం, ఇమ్యునైజేషన్ తదితర వివరాలను నమోదు చేయడంతోపాటు రోగులకు సత్వర సేవలు అందించాలి. వారి పరిధిలోని ప్రజలకు యోగా, ధ్యానంపై శిక్షణ ఇవ్వడంతోపాటు వారు రోజూ అనుసరించేలా పర్యవేక్షించాలి. ఇలా రోగులకు సేవలు అందించడంతోపాటు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలి.
జిల్లాకు 239 కంప్యూటర్లు
జిల్లాలో మొత్తం 239మంది ఎంఎల్హెచ్పీలను నియమించారు. వారికి ఒక్కొక్కరికీ ఒక్కో కంప్యూటర్ చొప్పున అందించేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాకు 239 కంప్యూటర్లు కేటాయించగా అవి మచిలీపట్నంలోని డీఎంహెచ్వో కార్యాలయానికి చేరాయి. వాటిని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంఎల్హెచ్పీలు అందరికీ పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాలనుంచి వచ్చే ఎంఎల్హెచ్పీలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సందడిగా ఉంది. ఇప్పటివరకు 170మందికి పంపిణీ చేశామని డీఎంహెచ్వో గీతాబాయి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!