logo

అభివృద్ధికి ఓటేయండి

కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్‌ అన్నారు.

Published : 28 Mar 2024 03:17 IST

ఇంటింటి ప్రచారంలో కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్‌, ఎంపీ అభ్యర్థి నాగరాజు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్‌ అన్నారు. నగరంలోని 48వ వార్డు రోజా ప్రాంతంలో ఆయన బుధవారం భరోసా యాత్ర చేపట్టారు. ఆయనతోపాటు కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. వారు ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఓటేయాలని కోరారు. కులం, మతం చూడకుండా ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తున్న తమ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో దీవించాలని భరత్‌ కోరారు. తెదేపా ప్రకటించిన సూపర్‌-6 పథకాలతో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. కర్నూలులో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేసి ఆరు గ్యారంటీలను తాను రూపొందించినట్లు తెలిపారు. తెదేపా సీనియర్‌ నాయకులు మన్సుర్‌ అలీఖాన్‌, దేవా, శ్యామ్‌, కార్పొరేటర్‌ పరమేష్‌, భాస్కర్‌, సౌభాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని