logo

ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి

ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు.

Published : 28 Mar 2024 03:27 IST

డా.పార్థసారథి

ఆదోని పురపాలకం న్యూస్‌టుడే: ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన- భాజపా కూటమిగా కలిసి ముందుకెళ్తున్నారు. పొత్తులో భాగంగా ఆదోని అసెంబ్లీ స్థానాన్ని భాజపాకు కేటాయించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డా.పార్థసారథికి టికెట్‌ కేటాయిస్తూ భాజపా అధిష్ఠానం నిర్ణయించింది. బీడీఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ) ఎండీఎస్‌(మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ) పూర్తి చేసిన ఆయనకు పార్థ డెంటల్‌ కేర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, పార్థ కాస్మొటాలజీ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 130కి పైగా ఆసుపత్రులు ఉన్నాయి. పార్థ ఛారిటబుల్‌ సొసైటీ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019లో భాజపా నుంచి కర్నూలు లోక్‌సభకు పోటీ చేశారు. ప్రస్తుతం రెండోసారి ఎన్నికల బరిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని