logo

శనివారం ఆదోనికి రానున్న జేపీ నడ్డా

ఆదోని పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా వస్తున్నారు.

Published : 10 May 2024 21:40 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా వస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదోని నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ పార్థసారథికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు దిల్లీ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆదోనికి చేరుకొని, అక్కడి నుంచి పురపాలక మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి చంద్రశేఖర్, జిల్లా ఇన్‌ఛార్జి అంకారెడ్డి తదితరులు పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని