logo

అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

జిల్లా అదనపు కలెక్టర్‌గా పద్మజారాణి సోమవారం బాధ్యతలు సీకరించారు. ఇటీవల పలు జిల్లాలకు ప్రభుత్వం అదనపు కలెక్టర్లను నియమిస్తూ 21న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా జిల్లాకు నియామకమైన పద్మజారాణి బాధ్యతలు చేపట్టగా..

Published : 25 Jan 2022 02:44 IST

పద్మజారాణికి పూలమొక్క అందించి స్వాగతం పలుకుతున్న కలెక్టరేట్‌ ఉద్యోగులు

నారాయణపేట పట్టణం, న్యూస్‌టుడే : జిల్లా అదనపు కలెక్టర్‌గా పద్మజారాణి సోమవారం బాధ్యతలు సీకరించారు. ఇటీవల పలు జిల్లాలకు ప్రభుత్వం అదనపు కలెక్టర్లను నియమిస్తూ 21న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా జిల్లాకు నియామకమైన పద్మజారాణి బాధ్యతలు చేపట్టగా.. కలెక్టరేట్‌ ఏవో నర్సింగ్‌ రావు, పీఎస్‌ ఖలీద్‌, ఉద్యోగులు ఆమెకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా చంద్రారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ విభాగానికి అదనపు కలెక్టర్‌గా పద్మజారాణి నియామకం అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని