అకస్మాత్తుగా తెరచుకున్న క్రూయిజర్ తలుపు
తలుపు తెరుచుకోగా క్రూయిజర్ వాహనంలో నుంచి కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన గురువారం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దకొత్తపల్లి మండలం
కిందపడి చిన్నారి మృత్యువాత
వెల్దండ గ్రామీణం, న్యూస్టుడే : తలుపు తెరుచుకోగా క్రూయిజర్ వాహనంలో నుంచి కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన గురువారం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దకొత్తపల్లి మండలం మారేడ్దిన్నెకు చెందిన కేతావత్ అనిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వలస వెళ్లారు. మేస్త్రీ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. మైసమ్మ ఉత్సవాలు కోసం గురువారం పెద్ద కుమార్తె కేతావత్ స్నేహ(4), నానమ్మ శాంతమ్మ, మేనత్త పద్మ సొంతూరుకు హైదరాబాదు నుంచి క్రూయిజర్ వాహనంలో బయలుదేరారు. హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై వెల్దండ మండలం పెద్దాపూర్ దగ్గర అకస్మాత్తుగా క్రూయిజర్ తలుపు తెరుచుకోవడంతో స్నేహ కింద పడిపోయింది. ప్రమాదంలో బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరడంతో అదే వాహనంలో చికిత్సకు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. చిన్నారి స్నేహ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఎస్సై నర్సింహులును వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృత్యువాత
వీపనగండ్ల, న్యూస్టుడే : విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతిచెందిన సంఘటన గురువారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని సంగినేనిపల్లిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అల్లె ఆంజనేయుడు(40) పదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. వరి నారుమడికి నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటారు మొరాయించడంతో సరిచేసేందుకు విద్యుత్తు నియంత్రిక నుంచి సరఫరాను ఆపేశాడు. మోటారుకు మరమ్మతులు చేశాక నియంత్రికను ప్రారంభించేందుకు వెళ్లగా.. విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. పక్క పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న వారు గమనించి దగ్గరికి వచ్చి చూసేసరికి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. నియంత్రిక దగ్గర ఎర్తింగ్ సరిగా లేకపోవడంతోనే విద్యుదాఘాతానికి గురైనట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆంజనేయుడుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రామన్గౌడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.