రుణాలిస్తాం.. రారండోయ్
రాజోలి మండల కేంద్రంలోని ఓ మహిళా పొదుపు గ్రూపు వారు మూడేళ్ల కిందట రూ.7 లక్షల రుణం తీసుకున్నారు. రుణ లక్ష్యం ఉండటంతో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి రూ.15 లక్షలు మంజూరు చేస్తామంటూ అధికారులు ఇళ్ల చుట్టూ తిరిగారు.
పెరిగిన బ్యాంకు లింకేజీ లక్ష్యంతో అధికారుల సతమతం
న్యూస్టుడే, గద్వాల న్యూటౌన్
అలంపూర్ మండలంలో రుణాలు పొందడంపై అవగాహన కల్పిస్తున్న ఐకేపీ అధికారులు
రాజోలి మండల కేంద్రంలోని ఓ మహిళా పొదుపు గ్రూపు వారు మూడేళ్ల కిందట రూ.7 లక్షల రుణం తీసుకున్నారు. రుణ లక్ష్యం ఉండటంతో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి రూ.15 లక్షలు మంజూరు చేస్తామంటూ అధికారులు ఇళ్ల చుట్టూ తిరిగారు. దాదాపు వారం రోజులపాటు వారితో చర్చలు జరిపినా భారమవుతుందంటూ ఆ మహిళలు రుణం తీసుకోలేదు.
* అలంపూర్ మండలంలోని 308 సంఘాలకు రూ.10.61 కోట్ల రుణం ఇవ్వాలన్నది లక్ష్యం. అధికారులు ఎలాగోలా తిప్పలు పడి మహిళలకు అవగాహన కల్పించి రూ.6 కోట్లకుపైగా ఇప్పించారు. ప్రభుత్వం సంఘాల సంఖ్య పెంచకుండానే రుణ లక్ష్యం మాత్రం రూ.18.64 కోట్లకు చేర్చింది.
వాయిదాలు చెల్లించడం భారం కావడంతో పరిమితికి మించి రుణాలు తీసుకోవడానికి మహిళా సంఘాల సభ్యులు ముందుకు రావడం లేదు. దీంతో బ్యాంకు లింకేజీ రుణాలు అర్హులైన పొదుపు సంఘాలకు ఇప్పించడం ఐకేపీ అధికారులకు తలకు మించిన భారమైంది. ఓ వైపు ఆర్థిక సంఘం ముగింపునకు మరో నాలుగు నెలలే ఉంది. ఈ క్రమంలో లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు మహిళల చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ లక్ష్యాన్ని పెంచడంతో కష్టంగా మారింది. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీవ్రమవుతుండటంతో \దరు చేయలేమంటూ బాహాటంగానే చెబుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 255 పంచాయతీల పరిధిలో మొత్తం 310 గ్రామైక్య సంఘాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 90 వేల మందికిపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు. వీరికి ఏటా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తున్నారు. 2020- 21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.100 కోట్లు, 2021- 22లో రూ.148.13 కోట్ల లక్ష్యం కేటాయించారు. అప్పుడు వంద శాతానికి పైగా లక్ష్యం సాధించారు. 2022-23లో రూ.177.97 కోట్ల లక్ష్యం ఉంది. ఇప్పటి వరకు రూ.110 కోట్లకుపైగా పూర్తి చేశారు. మిగిలిన లక్ష్యం ఎలా చేరుకోవాలనే దానిపై సెర్ప్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో లక్ష్యాన్ని రూ.216.54 కోట్లకు పెంచారు.
* ప్రతి గ్రామంలో గత ప్రణాళిక ప్రకారం స్వయం సహాయక సంఘాల్లో అర్హులైన వారిక రుణాలు ఇప్పించారు. రుణ లక్ష్యం పెరగడంతో.. ఏం చేయాలో పాలుపోని అధికారులు సక్రమంగా చెల్లిస్తున్న వారికే మళ్లీ ఇప్పిస్తున్నారు. రెండు, మూడేళ్ల కిందట రుణం తీసుకొని సగమైనా చెల్లించని వారి వెంటా పడుతున్నారు. వద్దన్నా వినకున్నా.. ఒత్తిడి తీసుకొచ్చి రుణం అదనంగా ఇస్తున్నారు. దీంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతుందని పలువురు అంటున్నారు. మొండి బకాయిలు పెరుగుతాయనే వాదనా బ్యాంకు అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి..
పొదుపు సంఘాలకు ఇచ్చే రుణ లక్ష్యం పెరిగిన మాట వాస్తవమే. ఈ మేరకు సెర్ప్ నుంచి ఆదేశాలొచ్చాయి. కొన్ని మండలాలకు సాధ్యం కాని విధంగా లక్ష్యం ఉంది. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాలతో అన్ని మండలాలకు విభజించి లక్ష్యం చేరుకునేందుకు చర్యలు చేపడతాం. లక్ష్యం భారమైనా తప్పదు. ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. వీలైనంత మేర పూర్తి చేస్తాం.
- రామ్మూర్తి, బ్యాంకు లింకేజీ డీపీఎమ్, గద్వాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం