జీవ జలాలు పైపైకి..!
జిల్లాలో భూగర్భ జలాల లభ్యత, వినియోగం, పెరుగుదల తదితర అంశాలపై భూగర్భజలశాఖ అధికారులు వార్షిక విశ్లేషణ నివేదికను తయారు చేశారు. గత పదేళ్లలో భూగర్భ జలాలు పెరుగుతూ వస్తున్నాయి.
భారీగా పెరిగిన భూగర్భ నీటిమట్టం
ఈ ఏడాది 6.45 మీటర్ల లోతులోనే లభ్యత
వార్షిక నివేదికలో వెల్లడి
నాగర్కర్నూల్, న్యూస్టుడే
జిల్లాలో భూగర్భ జలాల లభ్యత, వినియోగం, పెరుగుదల తదితర అంశాలపై భూగర్భజలశాఖ అధికారులు వార్షిక విశ్లేషణ నివేదికను తయారు చేశారు. గత పదేళ్లలో భూగర్భ జలాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది 6.45 మీటర్ల లోతులోనే నీరున్నట్టు అంచనా వేశారు. జిల్లాలో వర్షపాతం కంటే కేఎల్ఐ కాల్వ ద్వారా వచ్చిన నీరు, చెరువులు నింపడం ద్వారానే నీటి మట్టాలు పెరిగాయి. అధికారులు జరిపిన సర్వేలో కోడేరు మండలంలోని తుర్కదిన్నె గ్రామంలో కేవలం 4.42 మీటర్ల లోతులోనే నీరు అందుబాటులో ఉండగా, నాగర్కర్నూల్లో అత్యధికంగా 14.63 మీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. దశాబ్దకాలంలో చూస్తే గత మూడేళ్లలోనే నీటి మట్టాలు ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. అయితే ఇష్టానుసారంగా నీటిని ఉపయోగించడం, వృథాగా కిందికి వదిలేయడంతో తిరిగి ఆ నీరు దుందుభి వాగులోకే వెళ్తున్నాయి. ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేసే పద్ధతిని అవలంబించడం లేదు. జిల్లాలో అత్యధికంగా 19 గ్రామాల్లోనే నీటిని వినియోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
మొక్కుబడిగా కమిటీ సమావేశం : భూగర్భ జలశాఖ అధికారులు జలాల వినియోగం తదితర అంశాలపై ఇచ్చిన వాటిపై సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి, తీర్మానం చేస్తారు. అయితే ఇది మొక్కుబడిగానే కొనసాగుతోంది. బోర్లు వేసేందుకు అనుమతి పొందాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. వాల్టా చట్టాన్ని పూర్తిగా మర్చిపోయారు. వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమలు, అటవీ, విద్యుత్తు శాఖలు, డీఆర్డీవో, భూగర్భజల, మైనింగ్ శాఖలతో కలిపి కమిటీ ఉంటుంది. ఇందులో చర్చించిన అంశాల అమలు అనేది నామమాత్రమే అవుతోంది. ఏడాది మొత్తంలో ఒక్కరు కూడ బోరు వేసేందుకు అనుమతి తీసుకోని పరిస్థితి నెలకొంది.
వార్షిక అంచనా
భూగర్భ జలాల లభ్యత : 72,349 హెక్టా మీటర్లు
జలాల వినియోగం : 33,842 హెక్టా మీటర్లు
భవిష్యత్తు నికర భూగర్భ జలాల లభ్యత : 38,507 హెక్టా మీటర్లు
కలుషితం కాకుండా చూడాలి : ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితం కాకుండా చుసుకోవాల్సి ఉంది. పంటల దిగుబడి పెరుగుతుందని ఇష్టానుసారంగా రసాయన ఎరువులు, పురుగుల మందులను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు కలుషితం కావడమే కాకుండా నేలలు నిస్సారంగా మారతాయి. దీన్ని రైతులు గమనించడం లేదు. శుద్ధి చేసిన మురుగు నీటిని పరిశ్రామిక అవసరాలకు ఉపయోగించాలి. విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉండే చిరు ధాన్యాలు పండించడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది. జనానికి పౌష్టికాహారం అందుబాటులోకి వస్తుంది.
రమాదేవి, భూగర్భజలశాఖ అధికారి, నాగర్కర్నూల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.