మంజూరు ఒకరికి.. డబ్బు మరొకరికి
అధికారుల నిర్వాకంతో లబ్ధిదారునికి అందాల్సిన రాయితీ రుణం మరొకరి ఖాతాలో పడింది. వారు ఆ డబ్బును వాడుకోవడంతో లబ్ధిదారుడు ఇబ్బందులు పడుతున్నారు.
రాయితీ రుణం మంజూరైనట్లు ఉత్తర్వులు చూపుతున్న తిరుపతి
జడ్చర్లగ్రామీణం, న్యూస్టుడే : అధికారుల నిర్వాకంతో లబ్ధిదారునికి అందాల్సిన రాయితీ రుణం మరొకరి ఖాతాలో పడింది. వారు ఆ డబ్బును వాడుకోవడంతో లబ్ధిదారుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. మండలంలోని మల్లెబోయినపల్లి గ్రామానికి చెందిన డి.తిరుపతి పరిస్థితి ఇది.
వ్యాపార నిర్వహణకు రుణం... : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది వ్యాపారం నిర్వహించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న తిరుపతికి గత ఏడాది జూన్ 21న రూ.లక్ష రాయితీ రుణం మంజూరైంది. ఇందుకు లబ్ధిదారుడు రూ.20 వేలు బ్యాంకుకి చెలిస్తే మిగతా రూ.80 వేలు కలిపి రూ.లక్ష అతని ఖాతాలో జమవుతాయి. ఇందు కోసం బ్యాంకు ఖాతా ఉన్న జడ్చర్ల గంజ్ నుంచి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వెళ్లే దారిలోని బ్యాంకులో రుణం డబ్బులు జమ చేయడంతో పాటు రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా లబ్ధిదారుని దగ్గర చేయించుకున్నారు. ఎస్సీ కార్పొరేష£న్ ద్వారా రుణం మంజూరైన ధ్రువపత్రం వచ్చినా.. ఖాతాలో డబ్బు జమ కాలేదని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అదే గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఈ విషయం తెలిసి బ్యాంకు, ఎస్సీ కార్పొరేషన్ చుట్టూ బాధితుడు తిరగడంతో ఈ నెల 1వరకు పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, జరిగిన పొరపాటును సరిదిద్దకపోవడంతో విషయాన్ని ‘న్యూస్టుడే’ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై ఆరా తీయగా లబ్ధిదారునికి బదులు మరొకరి ఖాతాలో పడిన విషయాన్ని బ్యాంకు అధికారులు ధ్రువీకరించారు. సంబంధిత బ్యాంకు మేనేజర్ శేషఫణి మాట్లాడుతూ... బాధితుడితో మాట్లాడామని, ఇతరుల ఖాతాలో పడిన డబ్బు రికవరీ చేసి ఇప్పిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.