ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల పరిశీలన పూర్తి
ఉపాధ్యాయులు బదిలీ కోసం జనవరి 28 నుంచి ఈ నెల 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు హార్డ్ కాపీలు సంబంధిత అధికారులకు అందజేశారు.
ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తున్న డీఈవో గోవిందరాజులు
అచ్చంపేట, న్యూస్టుడే : ఉపాధ్యాయులు బదిలీ కోసం జనవరి 28 నుంచి ఈ నెల 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు హార్డ్ కాపీలు సంబంధిత అధికారులకు అందజేశారు. బదిలీ దరఖాస్తుల్లో పూర్తి వివరాలను నమోదు చేయడంతో వాటిని ఈ నెల 3 నుంచి సోమవారం వరకు అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో చేరిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీని నమోదు చేయడం ద్వారా ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయించి వాటి ఆధారంగా జాబితాలు సిద్ధం చేస్తారు. భార్యభర్తలు ఉద్యోగులుగా (స్పౌజ్) ఉన్న వారికి అదనంగా పది పాయింట్లు కేటాయిస్తారు. ఎనిమిదేళ్ల లో ఈ అదనపు పాయింట్లను ఒకసారి మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. మళ్లీ ఎనిమిదేళ్ల గడువు ముగిసిన తరువాతనే మరోసారి ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కూడా బదిలీల్లో అదనంగా పది పాయింట్లు కేటాయిస్తారు. వివిధ దీర్ఘకాలిక వ్యాధులు, వితంతువులు, అవివాహిత మహిళా ఉపాధ్యాయినులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది. దివ్యాంగులు, వ్యాధుల బాధితులు వైద్య నిపుణులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని విభాగాల ఉపాధ్యాయులు బదిలీ కోసం చేసుకున్న దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7,093 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
10 వరకు అభ్యంతరాల స్వీకరణ : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు, సర్వీసు పుస్తకాల పరిశీలన ముగిసింది. పరిశీలన తరువాత రూపొందించిన జాబితాలను మంగళవారం ఆన్లైన్లో ప్రకటించనున్నారు. పదోన్నతుల కోసం అర్హులైన వారి జాబితాలు, బదిలీల కోసం ఉపాధ్యాయులు పొందిన పాయింట్ల వివరాలతో సీనియార్టీ జాబితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు జాబితాలపై ఆన్లైన్లో తగిన ఆధారాలతో అభ్యంతరాలను తెలిపే అవకాశం కల్పించారు. పొరపాట్లు ఉంటే సరిచేయనున్నారు.తప్పుడు సమాచారం నమోదు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అభ్యంతరాలను పరిశీలించి సవరణలు చేసిన తరువాత ఈ నెల 11, 12 తేదీల్లో పదోన్నతులు, బదిలీల కోసం అర్హుల తుది జాబితాలను ప్రకటించనున్నారు. ఆ తరువాత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించి వరుస క్రమంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
* అపోహలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!